Jagan: తెలంగాణను నిలువరించండి
‘జలవిద్యుత్తు ఉత్పాదన కోసం అక్రమంగా నీటిని వినియోగించుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిలువరించండి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా వారు నీటిని వాడుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ అక్రమంగా వినియోగించుకుంటున్న
అక్రమంగా నీళ్లు వాడుకోకుండా చూడండి
కృష్ణా బోర్డు విధివిధానాలను ఖరారు చేయాలి
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ
కేంద్ర జల్శక్తి మంత్రి షెకావత్కూ మరో లేఖ
ఈనాడు, అమరావతి: ‘జలవిద్యుత్తు ఉత్పాదన కోసం అక్రమంగా నీటిని వినియోగించుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిలువరించండి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా వారు నీటిని వాడుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ అక్రమంగా వినియోగించుకుంటున్న నీటిని వారి వాటా 299 టీఎంసీల నుంచి మినహాయించాలి. కేంద్రం వెంటనే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి నోటిఫై చేయాలి. ఉమ్మడి జలాశయాల్లో నీటిని మళ్లించే చోట కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను మోహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ గురువారం రాత్రి లేఖ రాశారు. అలాంటి మరో లేఖను కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కూ పంపారు. ఆ లేఖల ప్రతులను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాల నేపథ్యంలో కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాసిన లేఖల ప్రతులను వాటికి జత చేశారు. ‘తెలంగాణ అనధికారికంగా ఇలా నీటిని వాడుకోవడంవల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నైవాసుల తాగునీటి అవసరాలు తీర్చలేని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి’ అని ఆ లేఖల్లో వివరించారు.
లేఖలోని ముఖ్యాంశాలు...
* 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పింది. ఇలాంటి ఏర్పాట్లు, పద్ధతులు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం అనధికారికంగా చేపడుతున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయని మీ దృష్టికి తీసుకొస్తున్నా.
* కృష్ణా బోర్డుకు చెప్పకుండానే తెలంగాణ ఎడమ వైపున ఉన్న కేంద్రం నుంచి ఏకపక్షంగా జల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించింది. దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి సాగునీటి అవసరమూ లేకుండానే విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించింది. సాగర్లో ఖరీఫ్ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా +532.90 అడుగుల వద్ద 173.86 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన సాగునీటి అవసరాలకు నీరు తీసుకున్నప్పుడే జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని గుర్తించాలి.
* శ్రీశైలం జలాశయంలో జూన్ 30 నాటికి వచ్చి చేరిన 17.36 టీఎంసీల ప్రవాహాల్లో 6.9 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్తు కోసం అనధికారికంగా వినియోగించుకుంది. శ్రీశైలంలో అవసరమైన నీటిమట్టాలు పెరగకుండా నిరోధించేలా ఈ చర్య ఉంది.
* రోజూ తెలంగాణ 2 టీఎంసీల నీటిని జల విద్యుత్తు ఉత్పాదనకు వినియోగిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. శ్రీశైలం జలాశయంలో +854 అడుగుల నీటిమట్టం స్థాయికి నీళ్లు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తాగునీరు, సాగునీరు తీసుకోలేదు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన నాలుగు రాయలసీమ జిల్లాలకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నై తాగునీటికి నీరు పోతిరెడ్డిపాడు నుంచే ఇవ్వాలి.
* తెలంగాణ అనధికారికంగా నీటిని వాడుకుంటున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలని, దానికోసం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవద్దని తెలంగాణ జెన్కో అధికారులకు కృష్ణా బోర్డు సూచించింది.
* ఇంకా అప్పటికీ తెలంగాణ జల విద్యుత్తు ఉత్పత్తి కొనసాగించడంతో మరో రెండుసార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాశాం.
* కృష్ణా బోర్డుకు చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా, నీటిని వినియోగించుకునేందుకు ఉన్న విధివిధానాలను పట్టించుకోకుండా తెలంగాణ నాగార్జునసాగర్లోనూ జలవిద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించింది. విద్యుత్తు ఉత్పత్తికి అనధికారికంగా, యథేచ్ఛగా 30,400 క్యూసెక్కుల నీటిని వాడేస్తున్నారు.
* తెలంగాణ జూన్ 29 రాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించింది. 4,000 క్యూసెక్కులు ఇందుకోసం వినియోగిస్తోంది. ఇందుకు కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి నీటి విడుదల ఉత్తర్వులూ తీసుకోలేదు. విజయవాడ జల వనరులశాఖ ఎస్ఈ నీటిని విడుదల చేయాలంటూ ఎలాంటి వినతులూ సమర్పించలేదు. ఈ విషయాన్నీ జూన్ 30న కృష్ణా బోర్డు దృష్టికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి 3.07 టీఎంసీల పూర్తి నీటినిల్వతో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇలా అనధికారికంగా నీటిని విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించి దిగువకు వదలడం వల్ల ప్రకాశం బ్యారేజి నుంచి ఎంతో విలువైన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలివేయాల్సి ఉంటుంది.
* మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించాలంటూ అక్కడి జెన్కో అధికారులను ఆదేశిస్తూ జూన్ 28న జీవో ఆర్టీ నంబరు 34ను విడుదల చేసింది. దీని ప్రకారం శ్రీశైలం నుంచి 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 3 టీఎంసీలు, పులిచింతల నుంచి 1.80 టీఎంసీలు అనధికారికంగా వినియోగించుకుంటారని అర్థమవుతోంది. జలవిద్యుత్తు ఉత్పాదన నిలిపివేయాలన్న కృష్ణాబోర్డు ఆదేశాలను ఇది పూర్తిగా ఉల్లంఘించడమే.
* కృష్ణాబోర్డు జలవిద్యుత్తు ఉత్పత్తి చేయవద్దని ఆదేశించినా తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకోవడం ఒప్పందాలను, జలనిర్వహణకు ఏర్పాటుచేసుకున్న నిర్దిష్ట ప్రామాణిక సూత్రాలను ఉల్లంఘించినట్లే. తెలంగాణ అనుసరిస్తున్న ఈ విధానాలు అంతర్రాష్ట్ర సత్సంబంధాలకు ఏ రకంగానూ తోడ్పడవు. అంతేకాదు.. దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీస్తాయి.
* 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పడింది. కేంద్రం నోటిఫై చేసిన ప్రకారం ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జలాల నియంత్రణ, ప్రాజెక్టుల నిర్వహణ, పాలానాపరమైన అంశాలను బోర్డే చూసుకోవాలి. బోర్డు అధికారాలు, విధులను నోటిఫై చేసే కసరత్తును కేంద్రం ఇంకా పూర్తి చేయలేదు. ఈలోపు మధ్యంతర ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజిలను ఆంధ్రప్రదేశ్.. జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ పరిధిలోకి తీసుకొచ్చారు. విద్యుత్తు కేంద్రాలు ఆయా రాష్ట్రాల భౌగోళిక ప్రాంతంలోనే ఉన్నందున ఆయా రాష్ట్రాలు వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకునేలా ఏర్పాట్లు జరిగాయి.
* కేంద్ర జలవనరులశాఖ అదనపు కార్యదర్శి ఛైర్మన్గా నిర్వహించిన సమావేశంలో 2015 జూన్ 18, 19 తేదీల్లో దిల్లీలో రెండు రాష్ట్రాల నీటి వాటాల వినియోగానికి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ 71% విశ్వసనీయతతో కేటాయించిన 811 టీఎంసీలు రెండు రాష్ట్రాలూ ఎలా వినియోగించుకోవాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం తెలంగాణ 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకోవాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆ నీటిని 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో చిన్ననీటి వనరుల వినియోగం, నీటి ఆవిరి నష్టాలు, గోదావరి నుంచి మళ్లించిన నీటి లెక్కలు పరిగణనలోకి తీసుకోకుండా 811 టీఎంసీలు ఈ నిష్పత్తిలో వినియోగించుకోవాలని ఒప్పందానికి వచ్చాయి.
* తదుపరి ఈ నీటి వినియోగానికి వీలుగా నిర్ణయాలు తీసుకునేందుకు అమలు ప్రక్రియకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఉంటారు. రెండు రాష్ట్రాలు తమకు ఎంత నీరు అవసరమో ప్రతిపాదిస్తే (ఇండెంటు పెడితే) నీటి లభ్యతను ఆధారంగా చేసుకుని చర్చించుకుని ఈ త్రిసభ్య కమిటీ కృష్ణా బోర్డుకు సిఫార్సు చేస్తే అక్కడ నిర్ణయం జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఆయా ప్రాజెక్టుల అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?