ఇది మొదటి ప్రమాద హెచ్చరిక
‘‘ఇది మనకు మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది. మొదటి, రెండోదశ ఉద్ధృతులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చాయి. అదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికా వేరియంట్ గురించి ముందే తెలిసింది. అందువల్ల అన్ని రకాల కొవిడ్
మాస్కులే టీకాలుగా పనిచేస్తాయి
రెండు డోసులు తీసుకుంటేనే రక్షణ
జాగ్రత్తగా లేకపోతే ముప్పు తప్పదు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు
ఈనాడు- హైదరాబాద్: ‘‘ఇది మనకు మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది. మొదటి, రెండోదశ ఉద్ధృతులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చాయి. అదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికా వేరియంట్ గురించి ముందే తెలిసింది. అందువల్ల అన్ని రకాల కొవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు’’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ముప్పు ఎప్పుడైనా రావొచ్చనీ, మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్షగా ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు కూడా సహకరించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మన మాస్కే వ్యాక్సిన్ లాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా రెండోడోసు తీసుకోని వ్యక్తులు సుమారు 25 లక్షలమంది ఉన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా హైదరాబాద్లో 5.90 లక్షల మంది, మేడ్చల్ మల్కాజిగిరిలో 4.89 లక్షలు, రంగారెడ్డిలో 4.15 లక్షల మంది గడువు తీరినా రెండోడోసు వేసుకోలేదని పేర్కొన్నారు. రెండు డోసులు వేసుకుంటేనే కొవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని, అప్రమత్తంగా లేకపోతే మూడోముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో గురువారం విలేకరులతో ప్రజారోగ్య సంచాలకులు మాట్లాడారు.
వైరస్ కనుమరుగు కాలేదు
‘‘వ్యాక్సిన్ ఈరోజు వేసుకున్నంత మాత్రాన రేపటినుంచి మనకు రక్షణ దొరికే అవకాశం లేదు. రక్షణ లభించడానికి సుమారు 2-4 వారాల సమయం పడుతుంది. జనవరి, ఫిబ్రవరిల్లో మరో దశ ఉధ్ధృతి రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇదే నిజం అయ్యే ప్రమాదముంది. ఎందుకంటే కరోనా వైరస్ ప్రవర్తన.. ప్రజల ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్లీ మన అనాలోచిత చర్యల వల్ల అలాంటి పరిస్థితులు పునరావృత్తం కానీయొద్దు. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. శుభకార్యాలు, వివాహాలు, ఇతరత్రా ఏ కార్యక్రమాల్లోనైనా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇప్పటికే మనం చూశాం. ఉదాహరణకు ఒక పాఠశాలలో తొలిరోజు ఒక కేసు వెలుగులోకి వస్తే.. మరుసటి రోజు పరీక్షల్లో 48 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈరోజు ఒక జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి కూడా కొవిడ్ సోకింది. మొన్ననే శాసనసభ స్పీకర్ కూడా పాజిటివ్గా తేలారు. దీన్నిబట్టి వైరస్ ఇంకా కనుమరుగు కాలేదనేది స్పష్టమవుతోంది. టీకా తీసుకోకపోతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో నెట్టుకున్నట్లే.
మాస్కు లేకుంటే రూ. 1000 జరిమానా
మాస్కు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించాల్సిందిగా పోలీసు వారిని కోరాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గతంలోనే జారీ చేసింది. వచ్చే 2, 3 నెలలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరిస్తే... మూడోదశ ఉధ్ధృతి రాకుండా అడ్డుకోవచ్చు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో టీకా ధ్రువపత్రాన్ని కూడా ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. అందరూ రెండు డోసులు తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని తమ వెంట తీసుకెళ్లాలి. రానున్న రోజుల్లో ధ్రువపత్రం వెంట తీసుకెళ్లడాన్ని తప్పనిసరి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించనున్నాం’’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న