వాహనరంగానికి ఊతం
రాష్ట్రంలో వాహనాల సంఖ్య, క్రయవిక్రయాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 ఆటోనగర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు, నాగ్పుర్ జాతీయ రహదారుల
రాష్ట్రంలో కొత్తగా 11 ఆటోనగర్లు
ముంబయి, బెంగళూరు, నాగ్పుర్ జాతీయ రహదారుల వెంబడి 3..
మరో 8 పట్టణాలకు మంజూరు
అవుటర్ వెలుపలకు హైదరాబాద్ ఆటోనగర్
వరంగల్లో యూనిట్లు శివారుకు తరలింపు
ఈనాడు, హైదరాబాద్
రాష్ట్రంలో వాహనాల సంఖ్య, క్రయవిక్రయాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 ఆటోనగర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు, నాగ్పుర్ జాతీయ రహదారుల వెంబడి ఒక్కోటి చొప్పున 3, మరో 8 పట్టణాలకు వీటిని మంజూరు చేసింది. జాతీయ రహదారుల వెంబడి యూనిట్లకు 30 ఎకరాలు, పట్టణాల్లో 10 ఎకరాల చొప్పున కేటాయించింది. వచ్చే ఆరు నెలల్లో కొత్త వాటిని ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల సంఖ్యకు అనుగుణంగా భవిష్యత్తులో అన్ని నగరాలు, పట్టణాలకు ప్రభుత్వం వాటిని విస్తరిస్తుందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని రకాల పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య 1.50 కోట్లకు చేరుకుంది. మరో పది వేల ఎలక్ట్రిక్ వాహనాలు కొత్తగా వచ్చాయి. ప్రస్తుతం ఈ రంగంలో పది లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వెయ్యి లోపు సర్వీసింగ్ సెంటర్లు, రెండు లక్షల మందికి పైగా ప్రైవేటు మెకానిక్లు ఉన్నారు. నగరాల్లో, పట్టణాల్లో బస్సులు, లారీలు, కార్లు తదితర వాహనాల మరమ్మతులు, ఇతర సేవలకు ఇబ్బందులెదురవుతున్నాయి. సిబ్బందికి వసతి సమస్యగా మారుతోంది. వీటన్నింటిపై అధ్యయనం చేసిన పరిశ్రమల శాఖ.. వాహనరంగానికి ప్రాధాన్యమివ్వడంతోపాటు వాటిపై ఆధారపడిన వారి కోసం, కొత్తగా ఉపాధి కల్పనకు ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కొత్తవి ఎక్కడెక్కడ..
ముంబయి జాతీయ రహదారిపై (సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామం వద్ద), బెంగళూరు, నాగ్పుర్ జాతీయ రహదారుల వెంబడి; కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (ఇటీవలే శంకుస్థాపన చేశారు), పెద్దపల్లి జిల్లా రామగుండం, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, వికారాబాద్ జిల్లా, కామారెడ్డి, జనగామ, జగిత్యాల
అన్ని సౌకర్యాలతో..
ఆటోనగర్ల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్వహిస్తుంది. కొత్త ఆటోనగర్లలో వాహనాలు, వాటి పరికరాల విక్రయ కేంద్రాలతో పాటు సర్వీసింగ్, రిపేరింగ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేస్తారు. రహదారులు, నీటిసరఫరా, మురుగునీటిపారుదల, పార్కింగ్, వేయింగు మిషన్ల సౌకర్యం కల్పిస్తారు.
ప్రస్తుతం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, బోధన్లలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోనగర్లు ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర చోట్ల ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో చిన్న చిన్న యూనిట్లుగా నడుస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్ ఆటోనగర్ల చుట్టూ జనావాసాలు భారీగా పెరిగాయి. దీంతో వాహనాల పార్కింగ్, కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్, వరంగల్ యూనిట్లను శివారు ప్రాంతాలకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఆటోనగర్ కోసం అవుటర్రింగ్రోడ్డు బయట 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు. -
దూరవిద్య బలోపేతానికి ప్రభుత్వాలు సహకరించాలి
దూరవిద్య బలోపేతం చేయడంతో పాటు, ఆధునికీకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఓయూలో నిర్వహించిన జాతీయ సదస్సులో వక్తలు విజ్ఞప్తి చేశారు. -
రూ.104 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర పోలీసుశాఖ రూ.104.18 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
గురుకుల డిగ్రీ పరీక్షకు 87.79% హాజరు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం సీట్ల భర్తీకీ ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79 శాతం విద్యార్థులు హాజరైనట్లు టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్ సైదులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!