పరిమితికి మించి రాష్ట్ర అప్పులు
చెల్లించాల్సిన రుణం ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లుగానే ఉన్నా, బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
ఆస్తుల కల్పన మీద ప్రభావం
వనరుల్ని పెంచుకోవాల్సి ఉంది
నివేదికలో వెల్లడించిన కాగ్
ఈనాడు - హైదరాబాద్
చెల్లించాల్సిన రుణం ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లుగానే ఉన్నా, బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. 2019-20లో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా, 2020-21లో తీసుకున్న రుణాల్లో 76.53 శాతం వరకు గతంలో తీసుకున్న అప్పులు చెల్లించడానికే వినియోగించాల్సి రావడంతో ఆస్తుల కల్పన మీద దాని ప్రభావం పడిందని తెలిపింది. 2021 మార్చి 31 వరకు చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో రూ. 1,06,468 కోట్లు (45.86 శాతం) రానున్న ఏడేళ్లలో తీర్చాలని, దీన్ని తట్టుకోడానికి రాష్ట్రం వనరులను పెంచుకోవాలని వివరించింది. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారానే సమకూరిందని తెలిపింది. 2020, 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను మంగళవారం తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యాంశాలివి..
* 2019-20 నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 2,32,181 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు రూ. 85,380.96 కోట్ల రుణాలు తీసుకున్నాయి. 2020-21 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,71,018 కోట్లకు చేరగా, బడ్జెటేతర రుణాలు రూ. 97,940.45 కోట్లుగా ఉంది. వీటికి సంబంధించిన వడ్డీ, అసలు మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లించాల్సి ఉంటుందని ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు తెలిపాయి. రుణం ఇచ్చిన సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుల విలువ రూ. 70,687.89 కోట్లు. అసలు, వడ్డీ తీర్చడానికి 2019-20 సంవత్సరంలో బడ్జెట్ నుంచి రూ. 6,557.26 కోట్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ పద్దులలో దీనిని ఆస్తులుగా పేర్కొంది.
* బడ్జెట్కు బయట తీసుకున్న రుణాలను పూర్తిగా సంపద సృష్టించడం కోసమే వినియోగిస్తున్నామని, ఆ ఖర్చును క్యాపిటల్ వ్యయంగానే పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి పథకాలకు బడ్జెటేతర రుణాలు తీసుకున్నట్లు వివరించింది. అయితే వాటి వినియోగానికి సంబంధించిన విధానాన్ని ప్రభుత్వం తెలపలేదని, దీనిపై విధానపరమైన మార్గదర్శకాలు స్పష్టంగా లేకుంటే భవిష్యత్తులో వాటిని వేరేలా ఖర్చు చేసే ప్రమాదం ఉందని కాగ్ పేర్కొంది. ఈ రుణాలకు సంబంధించిన వనరులను, ప్రయోజనాలను, పరిధిని సరైన రీతిలో ప్రకటించడం లేదని, ఫలితంగా కీలకమైన ప్రభుత్వ సామాజిక, ఆర్థిక పథకాలు/ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన వనరులు శాసనసభల నియంత్రణ, పర్యవేక్షణకు వెలుపల ఉండిపోయే అవకాశం ఉందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
* చెల్లించాల్సిన రుణం, జీఎస్డీపీల మధ్య నిష్పత్తి 2016-17 సంవత్సరంలో 18.42 శాతం ఉండగా, 2020-21 నాటికి 23.68 శాతానికి పెరిగింది. బడ్జెటేతర రుణాలను కూడా పరిగణలోకి తీసుకొంటే అప్పులు - రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 38.10 శాతం అవుతుందని కాగ్ పేర్కొంది. అయితే దీంతో ప్రభుత్వం ఏకీభవించలేదని, బడ్జెటేతర రుణాలను ఆయా సంస్థలు తమ పద్దుల నుంచే తిరిగి చెల్లిస్తాయని, వీటిని రాష్ట్రం అప్పుల్లో కలపడానికి లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది.
* వడ్డీ చెల్లింపులు రెవెన్యూ రాబడిని హరించివేస్తున్నాయని, 2015-16 సంవత్సరంలో రెవెన్యూ రాబడితో పోల్చితే 9.93 శాతం ఉన్న వడ్డీ చెల్లింపులు 2019-20 నాటికి 14.03 శాతానికి పెరిగాయని వివరించింది. 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిన (8.39 శాతం) కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. తీసుకున్న రుణాలను అభివృద్ధి పనులకు, ఆస్తులను సృష్టించడానికి వినియోగిస్తే మంచిదే కానీ రోజువారీ అవసరాల కోసమో, చెల్లించాల్సిన రుణాల మీద వడ్డీ కట్టడానికో తీసుకోవడం మాత్రం మంచిది కాదని పేర్కొంది.
* 2020 మార్చి నాటికి ఇచ్చిన పూచీకత్తులు రూ. 89,601 కోట్లు. 2018-19లో రెవెన్యూ రాబడి రూ. 1,01,420 కోట్లతో పోల్చితే ఇది 88 శాతం. అయితే ఎఫ్ఆర్బీఎం ప్రకారం ఇది 200 శాతం వరకు ఉండొచ్చు. ఇచ్చిన పూచీకత్తులలో 66 శాతం కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకేనని కాగ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత.. కాంబోడియాలో నరకయాతన
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా