113 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్
హైదరాబాద్ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో మరో ముందడుగు పడింది. రహదారి ఉత్తరభాగం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
భూములు గుర్తించాక గ్రామాల తుది జాబితా ఖరారు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో మరో ముందడుగు పడింది. రహదారి ఉత్తరభాగం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగ్దేవ్పూర్- భువనగిరి- చౌటుప్పల్ మీదుగా ఉత్తరభాగం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ భాగం 158.645 కిలోమీటర్ల మేర సాగుతుంది. భారత్మాల పరియోజన కింద కేంద్ర నిధులతో హరిత రహదారిగా నిర్మించనున్న దీనికి భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. నిర్మాణం మొత్తం కేంద్ర నిధులతో సాగుతుంది. పూర్తి ఎక్స్ప్రెస్ వేగా, రెండు భాగాలుగా నిర్మించే 344 కిలోమీటర్ల మార్గంలో.. ఉత్తర భాగానికి కేంద్రం గత ఏడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ నంబరు కేటాయించాల్సి ఉంది.ఉత్తర భాగం భూసేకరణకు అనుమతి లభించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను గుర్తించనున్నారు.
భూములను గుర్తించిన తరువాత ఆ వివరాలతో మరో దఫా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో 113 గ్రామాలను పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 34 గ్రామాలు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 35, సిద్దిపేటలో 24, సంగారెడ్డి జిల్లాలో 20 గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టిన తరువాత సాంకేతికంగా జారీ చేసే నోటిఫికేషన్లో గ్రామాల తుది జాబితా ఖరారవుతుందని అధికారిక సమాచారం.
యాదాద్రి-భువనగిరి జిల్లా...
చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని గ్రామాలు: చిన్నకొండూరు, చౌటుప్పల్, లింగోజిగూడెం, పంతంగి, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగడపల్లి (చౌటుప్పల్ మండలం), వర్కట్పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, పహిల్వాన్పూర్, కంచనపల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక (వలిగొండ మండలం).
భువనగిరి ఆర్డీవో పరిధి: రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి మండలం).
యాదాద్రి-భువనగరి అదనపు కలెక్టర్ పరిధి:: మల్లాపురం, దాతార్పల్లి (యాదగిరిగుట్ట మండలం). గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కొండాపూర్/కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి మండలం).
సిద్దిపేట జిల్లా...
గజ్వేల్ ఆర్డీవో పరిధి: బేగంపేట, ఎల్కల్ (రాయపోల్ మండలం). బంగ్లా వెంకటాపూర్, మక్తామాసాన్పల్లి, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్పల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లె, పాములపర్తి (గజ్వేల్ మండలం). మజిద్పల్లి, నెంటూరు, జబ్బాపూర్, మైలారం, కొండాయిపల్లి (వర్గల్ మండలం). మర్కూక్, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్ మండలం). ఆలిరాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్దేవ్పూర్ మండలం).
మెదక్ జిల్లా...
తూప్రాన్ ఆర్డీవో పరిధి: వట్టూరు, జండపల్లి, నాగులపల్లి, ఇస్లాంపూర్, దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, వెంకటాయిపల్లి, కిష్టాపూర్, తుప్రాన్, నర్సంపల్లి, (తూప్రాన్ మం). నర్సాపూర్ ఆర్డీవో పరిధి: వెంకటాపూర్ (కౌడిపల్లి). లింగోజిగూడ, పాంబండ, పోతులబొగుడ, కొంతాన్పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్, కొత్తపేట(శివ్వంపేట్ మం.). నాగులపల్లి, మూసాపేట, మహ్మదాబాద్/జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిరుమలాపూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట, సీతారాంపూర్, రుస్తుంపేట, మంతూర్, మల్పర్తి, తుజాల్పూర్ (నర్సాపూర్).
సంగారెడ్డి జిల్లా...
సంగారెడ్డి ఆర్డీవో పరిధి: సంగారెడ్డి, నాగాపూర్, ఇరిగిపల్లి, చింతలపల్లి, కల్పగూర్, తాళ్లపల్లి, కుల్పగూర్ (సంగారెడ్డి మండలం). పెద్దాపూర్(సదాశివపేట మండలం). కాసాల, దేవులపల్లి, హత్నూర, దౌల్తాబాద్ కొత్తపేట, సికిందర్పూర్(హత్నూర్ మండలం).
ఆందోల్-జోగిపేట ఆర్డీవో పరిధి: శివంపేట, వేండికోల్, అంగడికిష్టాపూర్, లింగాపల్లి, కోర్పోల్(చౌటకూర మండలం). గిర్మాపూర్, మల్కాపూర్ (కొండాపూర్ మండలం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?