నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ గురువారం హైదరాబాద్లో దాదాపు రెండున్నర గంటలపాటు ఉండనున్నారు. ఆయన రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో మోదీ దిగింది మొదలు తిరిగి చెన్నై వెళ్లే వరకూ ప్రతి అంశాన్నీ పోలీసులు కూలంకషంగా పర్యవేక్షిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవాలతోపాటు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు...
హైదరాబాద్లో రెండున్నర గంటలపాటు మోదీ పర్యటన
ఐఎస్బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు
ఈనాడు, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ గురువారం హైదరాబాద్లో దాదాపు రెండున్నర గంటలపాటు ఉండనున్నారు. ఆయన రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో మోదీ దిగింది మొదలు తిరిగి చెన్నై వెళ్లే వరకూ ప్రతి అంశాన్నీ పోలీసులు కూలంకషంగా పర్యవేక్షిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవాలతోపాటు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరుతారు. ఐఎస్బీలో కార్యక్రమం నిర్వహించే వేదికపై మూడు వరుసల్లో అతిథులు ఆసీనులవుతారు. ప్రధానికి కుడివైపు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎడమవైపు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ హరీశ్ మొనవాని కూర్చుంటారు. వెనుక వరుసల్లో విద్యాసంస్థ ప్రొఫెసర్లు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఉన్న పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అధికార ప్రతినిధిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఐఎస్బీలో ప్రధాని కార్యక్రమాల సరళి ఇలా..
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని ఐఎస్బీకి చేరుకుని తొలుత ఓ మొక్క నాటుతారు. అనంతరం విద్యా సంస్థ 20 ఏళ్ళ చరిత్రకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటోలను తిలకిస్తారు. సిబ్బందితో ఫొటో దిగుతారు. అనంతరం అతిథుల పుస్తకంలో సంతకం చేసి వేదికపైకి వస్తారు. ప్రధానికి స్వాగత సత్కారాల అనంతరం ఐఎస్బీ డీన్ స్వాగతోపన్యాసం, ఛైర్మన్ హరీశ్ మన్వాని ప్రసంగం ఉంటాయి. తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన స్మారక చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. అన్నిరంగాల్లో ప్రతిభ కనబరచిన 8 మంది విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు, ధ్రువపత్రాలు అందజేస్తారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగం ఉంటుంది.3.15 గంటలకు ప్రధాని ఐఎస్బీ నుంచి నిష్క్రమిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యాలయ ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) తమ ఆధీనంలోకి తీసుకుంది.
కార్యకర్తల కోసం 20 నిమిషాలు..
ఐఎస్బీ నుంచి బేగంపేట చేరుకున్న తర్వాత ప్రధానమంత్రి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందుకోసం 20 నిమిషాలు కేటాయిస్తారు. అనంతరం 3.55 గంటలకు చెన్నై బయలు దేరుతారు. ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా స్థానిక పోలీసులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఉన్నతస్థాయి సమావేశం
ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పర్యటన సాఫీగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో సమీక్షించారు. ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..