చిన్నారులకు నేత్ర గండం
కరోనా లాక్డౌన్ విధించిన 2020లో ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులకు నెలలు నిండకుండా కవలలు పుట్టారు. వారి వయసు పెరుగుతున్న కొద్దీ చూపులో తేడా ఉన్నట్లు తల్లిదండ్రులు గ్రహించారు. ఏడాది తర్వాత ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యులను
ముందస్తు జననంతో రెటినోపతి
సుమారు 30-40 శాతం మందిలో నిర్ధారణ
కరోనా కాలంలో రెట్టింపైన ముప్పు
వైద్యుల్లో అవగాహన అవసరమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్
కరోనా లాక్డౌన్ విధించిన 2020లో ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులకు నెలలు నిండకుండా కవలలు పుట్టారు. వారి వయసు పెరుగుతున్న కొద్దీ చూపులో తేడా ఉన్నట్లు తల్లిదండ్రులు గ్రహించారు. ఏడాది తర్వాత ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. కవలలిద్దరికీ ‘ముందస్తు జననం కారణంగా రెటినోపతి-రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ(ఆర్ఓపీ)’ ఉన్నట్లుగా నిర్ధారించారు. వారు పుట్టిన నెలలోపు అత్యవసర చికిత్స నిర్వహించి ఉంటే కంటి చూపువచ్చే అవకాశాలుండేవని చెప్పారు. అయినా వైద్యులు తమ వంతుగా ప్రయత్నించి.. శస్త్రచికిత్స చేపట్టి 30 శాతం చూపు తేగలిగారు. ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలా నెలలు నిండకుండా పుట్టిన పసిపాపల నిదుర కళ్లను ‘రెటినోపతి’ కాటేస్తోంది. ముందుగా పుట్టిన చిన్నారుల్లో దాదాపు 30-40 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 15 శాతం మంది కోలుకునే అవకాశాల్లేక అంధత్వం వస్తుంది. ఆర్ఓపీ సమస్య వచ్చినవారిలో 80-90 శాతం మంది కొవిడ్ కాలంలో సకాలంలో చికిత్సను పొందలేకపోవడంతో.. దాదాపు 60 శాతానికి పైగా పూర్తి అంధత్వం బారిన పడినట్లు నిపుణులు చెబుతున్నారు. మిగిలిన 40 శాతం మంది కొద్దిపాటి చూపువచ్చినా పెద్ద వస్తువులను మాత్రమే చూడగలరు. మనుషుల ముఖాలను గుర్తించలేరు. ఈ పరిస్థితి తెలంగాణలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పుట్టిన పిల్లల్లో ఎదురైందని నిపుణులు చెబుతున్నారు.
ఏమిటీ ఆర్ఓపీ?
అవయవాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందే జన్మించడంతో.. కొందరిలో కంటి అంతర్భాగంలోని ‘రెటీనా’ పొర అసమతౌల్యంగా ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య ఉన్నట్లు గుర్తించకపోవడంతో శిశువులు శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. మరీ 1000 గ్రాముల కంటే తక్కువగా పుట్టిన చిన్నారులనైతే 21-25 రోజుల్లోపే రెటినోపతి పరీక్ష చేయాలి. అంతకంటే ఎక్కువ బరువున్న పిల్లల్ని 30-35 రోజుల్లోపు పరీక్షించినా పరవాలేదు. మూణ్నాలుగు నెలల్లోపు సమస్య గుర్తించలేకపోతే.. శాశ్వతంగా అంధత్వం బారినపడే ప్రమాదముంది. ఎక్కువమంది వైద్యులకు కూడా ఆర్ఓపీని గుర్తించడంపై అవగాహన లేదు. ఆర్ఓపీ పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ వైద్యంలో పెంచాలి. ప్రస్తుతం గాంధీ, నిలోఫర్, సంగారెడ్డి, సరోజినీదేవి, ఎంజీఎం, నల్గొండ తదితర కొన్ని వైద్యకేంద్రాల్లో మాత్రమే ఈపరీక్షలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ దశలోనే వైద్యులకు ఈ అంశంపై శిక్షణ ఇవ్వాలి.
గుర్తించలేకపోవడమే ప్రధాన సమస్య
-డాక్టర్ యాదయ్య, నవజాత శిశువుల వైద్య నిపుణులు, ఎస్ఎన్సీయూ, నల్గొండ
నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా రాక ముందు సంవత్సరం 2019లో ముందస్తుగా పుట్టిన 371 మంది పిల్లలకు ఆర్ఓపీ పరీక్షలు నిర్వహించగా.. 32 మందిలో సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనాకాలం 2020లో 272 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి ఆర్ఓపీ ఉన్నట్లు తేలింది. 2021లో 286 శిశువులను పరీక్షిస్తే... 13 మందికి ఆర్ఓపీ బయటపడింది. వీరిలో 72 శాతం మంది గ్రామీణులే. తల్లిదండ్రులకు కూడా ఆర్ఓపీ ప్రాధాన్యం తెలియదు. పిల్లలు నెలలు నిండకుండా 1700-1800 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుడితే.. అలాంటివారిలో ఆర్ఓపీ సమస్య వచ్చే అవకాశాలున్నాయనే అవగాహన ముందుగా వైద్యుల్లో ఉండాలి. తప్పనిసరిగా ఆ కోణంలో చిన్నారులను పరీక్షించాలి.
నెలలోపు చికిత్సతో మెరుగైన ఫలితాలు
-డాక్టర్ సుభద్ర జలాలీ, పిల్లల రెటినా స్పెషలిస్టు, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి
బయటినుంచి పిల్లల కన్ను చూడడానికి సాధారణంగానే ఉంటుంది. పరీక్షిస్తే తప్ప ఆర్ఓపీ ఉన్నట్లుగా తెలియదు. వ్యాధి ముదిరిన తర్వాత శస్త్రచికిత్స చేసినా చూపు పూర్తిగా వచ్చే అవకాశాలు తక్కువే. కరోనాకు ముందు రోజుకు 2-3 మంది చిన్నారులు ఆర్ఓపీ సమస్యతో వచ్చేవారు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత రోజుకు 7-8 మంది వస్తున్నారు. 2020కి ముందు రోజుకు ఆర్ఓపీకి సంబంధించి 7-8 ఆపరేషన్లు చేసేదాన్ని. ఇప్పుడు రోజుకు సుమారు 15 వరకు చేస్తున్నా. లాక్డౌన్ సమయంలో ఎవరైతే సమస్య గుర్తించగలిగారో వారి పిల్లలకు చూపు లభించింది. ఇప్పుడు బంగ్లాదేశ్, నైజీరియా నుంచి శిశువులను ఈ సమస్యతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఆర్ఓపీ వచ్చినవారికి నెలలోపు చికిత్స అందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..