కాన్పుకెళితే కోతలే
పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏప్రిల్ 2021 నుంచి ఈనెల 20 వరకూ 2,230 కాన్పులు జరగ్గా.. ఇందులో 191 మాత్రమే సహజ ప్రసవాలు.. మిగిలిన 2,035(91 శాతం) కాన్పు కోతలే. మొత్తం 18 ఆసుపత్రుల గణాంకాలను పరిశీలించగా.. 6 ఆసుపత్రుల్లో నూరుశాతం సిజేరియన్లే. మరో 8 ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా కాన్పు కోతలే.
దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే కోత కాన్పులు అధికం
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వందశాతం
అడ్డుకట్ట వేసేలా సర్కారు కార్యాచరణ
ఆరోగ్యశ్రీలో సిజేరియన్లకు చెల్లింపులు నిలిపివేత
ఈనాడు - హైదరాబాద్: రాష్ట్రంలో ప్రసవ కోతలు(సిజేరియన్లు) పెరిగిపోతున్నాయి. దేశం మొత్తమ్మీద తెలంగాణ ప్రైవేటు దవాఖానాల్లో అత్యధికంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మరోవైపు సర్కారు ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలుపుకొని సగటున 60.7 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. కరీంనగర్లో అధికంగా 82.4 శాతం, తక్కువగా కుమురంభీం జిల్లాలో 27.2 శాతం నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు కోతల రాష్ట్ర సగటు 44.5 శాతం కాగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతున్నాయి. ప్రభుత్వ సగటు కన్నా ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం 48.6 శాతం, జగిత్యాలలో 64.9 శాతం, కరీంనగర్లో 66.8 శాతం నమోదయ్యాయి. అదే కర్ణాటకలో 28 శాతం, మహారాష్ట్రలో 31 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.
* పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏప్రిల్ 2021 నుంచి ఈనెల 20 వరకూ 2,230 కాన్పులు జరగ్గా.. ఇందులో 191 మాత్రమే సహజ ప్రసవాలు.. మిగిలిన 2,035(91 శాతం) కాన్పు కోతలే. మొత్తం 18 ఆసుపత్రుల గణాంకాలను పరిశీలించగా.. 6 ఆసుపత్రుల్లో నూరుశాతం సిజేరియన్లే. మరో 8 ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా కాన్పు కోతలే.
*జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 2021 నుంచి ఈఏడాది మార్చి వరకూ ప్రసవాలను పరిశీలిస్తే.. 39 ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,016 ప్రసవాలు చేయగా.. ఇందులో 7,844(87 శాతం) కాన్పు కోతలు నిర్వహించారు. వీటిల్లోనూ 3,637(40.3 శాతం) తొలికాన్పు కోతలే కావడం గమనార్హం. ఇందులో 22 ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా సిజేరియన్లే చేశారు.
మిడ్వైఫరీ వ్యవస్థ అమలు
సహజ కాన్పుల కోసం ‘మిడ్వైఫరీ నర్సింగ్’ శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. కాన్పు సమయంలో ముప్పు అధికంగా ఉన్నవారు.., సహజ ప్రసవానికి ఆటంకాలు లేనివారు ఏయే ఆసుపత్రులకు వెళ్లాలనేది ముందుగానే సూచిస్తారు. గర్భిణి దశ నుంచే సహజ కాన్పునకు అవసరమయ్యే తేలికపాటి వ్యాయామాలను చేయిస్తారు. నొప్పుల సమయంలో గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో సుశిక్షితులైన నర్సులు కాన్పులో కీలకపాత్ర పోషిస్తారు. కాన్పు గదిలో కూడా భర్త పక్కనే ఉండేలా ప్రోత్సహిస్తారు. తద్వారా గర్భిణి మానసిక స్థైర్యంతో ప్రసవానికి సిద్ధపడేలా చేస్తారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కింద సిజేరియన్ చేస్తే ప్రభుత్వం రూ.11 వేలు ఇస్తుండగా.. దీన్ని నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సాధారణ ప్రసవానికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
వైద్యశాఖ మంత్రి హరీశ్ చొరవ
కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో కాన్పు కోతలు పెరగడంతో దీన్ని తగ్గించడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ... ‘ఏ జిల్లాకు వెళ్లినా ఇదే విషయంపై ప్రైవేటు వైద్యులతో సమావేశమవుతున్నాను. సిజేరియన్లను తగ్గించడంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ప్రసవ కోతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లకూ ఆదేశాలిచ్చాం’’ అని వివరించారు.
తొలికాన్పు సిజేరియన్ కాకుండా చూడాలి: డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్ట్
తొలికాన్పు సిజేరియన్ అయితే.. అత్యధిక సందర్భాల్లో రెండో కాన్పు కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది. అందువల్ల తొలి కాన్పులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే తప్ప సిజేరియన్ జోలికివెళ్లొద్దు. ప్రసవ నొప్పులను గర్భిణులు భరించలేకపోవడం కూడా కోత కాన్పులకు మరో కారణం. అప్పట్లో ఇంట్లో పెద్దవారు నొప్పుల సమయంలో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సిజేరియన్ చేసేయమని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు వైద్యులు వ్యాపారాత్మక ధోరణి కోత కాన్పుల సంఖ్య పెరగడానికి కారణం.
సహజ ప్రసవాలతో తల్లీబిడ్డకు మేలు
సహజ ప్రసవం వల్ల తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే సిజేరియన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. 35 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లి బరువైన పనులు చేసుకోలేకపోతోంది. పుట్టిన బిడ్డకు తొలిగంటలో తల్లి పాలివ్వడం అమృతంతో సమానం. రోగ నిరోధకశక్తి గణనీయంగా పెరుగుతుంది. శారీరక ఎదుగుదల, చురుకుదనం బావుంటుంది. సిజేరియన్ కారణంగా రాష్ట్రంలో కేవలం 36 శాతం మంది శిశువులకు తల్లులు తొలిగంటలో పాలు ఇవ్వగలుగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన