Agnipath: అగ్నిపథ్ ఆగే ప్రసక్తే లేదు
త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. మునుపటి విధానం కొనసాగబోదంది. మూడు దళాలు మరో అడుగు ముందుకేసి.
రక్షణశాఖ స్పష్టీకరణ
నియామక షెడ్యూళ్లను ప్రకటించిన త్రివిధ దళాలు
తొలి 4-5 ఏళ్లు 60వేల మంది నియామకం
24 నుంచి వాయుసేనలో దరఖాస్తుల నమోదు
ఈనాడు, దిల్లీ: త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. మునుపటి విధానం కొనసాగబోదంది. మూడు దళాలు మరో అడుగు ముందుకేసి.. అగ్నిపథ్ కింద నియామకాల కోసం ఆదివారం షెడ్యూళ్లను ప్రకటించాయి. త్రివిధ దళాల్లో సరాసరి వయసును తగ్గించడమే అగ్నిపథ్ ఉద్దేశమని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ స్పష్టంచేశారు. ఈ మేరకు 1989 నుంచి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కార్గిల్ యుద్ధం అనంతరం ఏర్పాటైన సమీక్ష కమిటీ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేసిందన్నారు. ఇప్పుడు కొవిడ్-19 పుణ్యమాని ఆ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. పర్వతప్రాంతాల్లో పనిచేసే సైనికుల్లో కొందరు ప్రతికూల వాతావరణం వల్ల చనిపోతున్నారని, అందుకు ప్రధాన కారణం వయసేనని విశ్లేషించారు. అగ్నిపథ్పై యువకులు తమ నిరసనను విరమించుకోవాలని కోరారు. ఇదివరకు ర్యాలీల్లో పాల్గొని శారీరక, వైద్య, ప్రవేశపరీక్షలు పూర్తిచేసి నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నవారూ అగ్నిపథ్ కింద దరఖాస్తు చేసుకోవాల్సిందేనని వెల్లడించారు. అలాంటివారి కోసమే వయోపరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. ఆయన ఆదివారం ఇక్కడ త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా, వైస్ అడ్మిరల్ డి.కె.త్రిపాఠి, లెఫ్టినెంట్ జనరల్ సి.బి.పొన్నప్పలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలివీ..
* అగ్నిపథ్ కింద వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ఆరంభమవుతుంది. జులై 24 నుంచి తొలిదశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబరు చివరికల్లా తొలి అగ్నివీర్ బ్యాచ్ నియామకం జరుగుతుంది. డిసెంబరు 30 నుంచి వారికి శిక్షణ మొదలవుతుంది.
* నేవీలో అగ్నివీరుల నియామకాల కోసం జూన్ 25కల్లా విస్తృత మార్గదర్శకాలు విడుదలవుతాయి. నవంబరు 21 కల్లా మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుంది. నౌకాదళంలో మహిళలకూ అగ్నివీరులుగా అవకాశం కల్పిస్తారు. వీరు యుద్ధనౌకల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* ఆర్మీలో అగ్నివీర్ నియామక ప్రక్రియ కోసం సోమవారం ముసాయిదా నోటిఫికేషన్ వెలువడుతుంది. తదుపరి.. సైన్యంలోని వివిధ రిక్రూట్మెంట్ విభాగాలు జులై 1 నుంచి నోటిఫికేషన్లు జారీచేస్తాయి. ‘జాయిన్ ఇండియా వెబ్సైట్’ ద్వారా దరఖాస్తులు పంపుకోవచ్చు. నియామకం కోసం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో ర్యాలీలు జరుగుతాయి. రెండు బ్యాచ్లుగా నియామకం జరుగుతుంది. తొలి బ్యాచ్లో 25వేల మందిని డిసెంబరు రెండో వారానికల్లా నియమిస్తారు. రెండో బ్యాచ్ నియామకం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ రెండింటిలో కలిపి 40వేల మందిని నియమిస్తారు. దేశవ్యాప్తంగా 83 ర్యాలీలు నిర్వహిస్తారు.
* నియామకాల సంఖ్య ఏటా 46వేలకే పరిమితం కాదు. 4-5 ఏళ్లలో 50 వేల నుంచి 60వేలకు పెంచుతారు. ప్రస్తుతం సైనిక దళాల వద్ద 60వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. క్రమంగా దీన్ని విస్తరించుకుంటూ వార్షిక నియామకాలను 90వేల నుంచి 1.20 లక్షలవరకు తీసుకెళ్తారు.
* విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అగ్నివీరుడికి రూ.కోటిదాకా బీమా, పరిహారం దక్కుతాయి.
* 18 ఏళ్లలోపు అభ్యర్థుల తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకాలు చేయాల్సి ఉంటుందని వాయుసేన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయని, అనారోగ్యం ఆధారంగా సిక్ లీవ్లు లభిస్తాయని తెలిపింది.
అల్లరి మూకలకు అవకాశం లేదు
కోచింగ్ సంస్థలే యువకుల్లో ఆశలు రేపి రెచ్చగొడుతున్నాయని అనిల్ పురీ పేర్కొన్నారు. అలాంటి సంస్థల్లో శిక్షణ పొందుతున్నవారిలో 70 శాతం మంది గ్రామీణులేనని చెప్పారు. ‘‘వాళ్లు అప్పులు చేసి చదువుకుంటున్నారు. వారికి కోచింగ్ సంస్థలు ఎన్నో హామీలిస్తున్నాయి. వాటి నిర్వాహకులే అభ్యర్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి పంపుతున్నారు’’ అని తెలిపారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పాల్గొనేవారికి త్రివిధ దళాల్లోకి ప్రవేశం ఉండబోదని స్పష్టంచేశారు. నియామకాలకు ముందు పోలీసు పరిశీలన ఉంటుందన్నారు. ‘‘సైనిక దళాల్లో క్రమశిక్షణరాహిత్యానికి తావులేదు. అగ్నిపథ్లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎలాంటి నిరసనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞపత్రం ఇవ్వాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా అగ్నిపథ్ కింద కొన్ని ఉపశమన చర్యలను ప్రభుత్వం ప్రకటించడానికి.. ఆందోళనలు కారణం కాదని స్పష్టంచేశారు. కొంతకాలంగా వాటిపై కసరత్తు జరుగుతోందన్నారు. సాధారణ పరిస్థితుల్లోనూ త్రివిధ దళాల్లో ఏటా 17,600 మంది ముందస్తు పదవీ విరమణ పొందుతున్నారని చెప్పారు. అగ్నిపథ్ అమలు వల్లే అనేకమంది సైన్యం నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వస్తుందన్న వాదన సరికాదన్నారు.
తోడ్పాటు ఉంటుంది
అగ్నివీరుల్లో 60-70 శాతం మంది పదో తరగతివారే ఉంటారని అనిల్ పురీ తెలిపారు. ‘‘సర్వీసు నుంచి బయటికొచ్చేనాటికి వారి వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉంటుంది. వారికి 12వ తరగతి సర్టిఫికెట్ జారీచేస్తాం. తర్వాత డిగ్రీ పూర్తిచేయడానికి చేయూత అందిస్తాం. వారికి పూర్తి క్రమశిక్షణ, నైపుణ్యం అలవడుతుంది. అందువల్ల సులువుగా ఉద్యోగాలు దొరుకుతాయి. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల్లో 25% మందిని రెగ్యులర్ సర్వీసులో చేర్చుకుంటాం. మిగిలిన 75% మందికి కేంద్ర సాయుధ బలగాల్లో, రక్షణ శాఖ నియామకాల్లో 10% చొప్పున ప్రాధాన్యం ఇస్తాం. పోలీసుశాఖలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరతాం’’ అని చెప్పారు. బయటికొచ్చేవారి చేతిలో రూ.11.70 లక్షల నిధి ఉంటుందన్నారు. దాంతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. వారికి బ్యాంకులు రుణాలు అందిస్తాయన్నారు.
త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ భేటీ
అగ్నిపథ్పై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. వరుసగా రెండోరోజూ ఆదివారం త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. నిరసనకారులను శాంతింపజేయడంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం