సోమనాథ కళాపీఠం పురస్కారాల ప్రదానం

సోమనాథ కళాపీఠం 2020 పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమండపంలో నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై పురస్కారాలు అందజేశారు.

Published : 27 Jun 2022 05:16 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: సోమనాథ కళాపీఠం 2020 పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమండపంలో నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై పురస్కారాలు అందజేశారు. తడకమళ్ల రాంచందర్‌రావు (మిర్యాలగూడ)కు సోమనాథ రంగస్థల పురస్కారం, చింతకాయల ఆంజనేయులు (ఖమ్మం)కు వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారం, చిలుకమారి రాజేష్‌ (పాలకుర్తి)కు డాక్టర్‌ రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారం, వేముల శ్రీ (సిద్దిపేట)కి దేవగిరి రాజయ్య స్మారక, సరస్వతీ సంసేవక బిరుదు ప్రదానం చేశారు. లింగయ్యస్వామి (హైదరాబాద్‌) తరఫున సోమనాథ సాహిత్య పురస్కారాన్ని ఆయన సన్నిహితుడు జగదీశ్‌ స్వీకరించారు. దండి వెంకట్‌ (నిజామాబాద్‌)కు సోమనాథ సామాజిక శోధన పురస్కారం, సత్తి సునీల్‌రెడ్డి (విశాఖపట్నం)కి శేఖర్‌బాబు రాజయ్యశాస్త్రి స్వచ్ఛంద భాషా సేవా పురస్కారం, వేదవీర్‌ ఆర్య (దిల్లీ)కు ముశం దామోదర్‌రావు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కారాన్ని పంపనున్నట్లు పీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని