T Hub: ప్రపంచ అంకుర రాజధానిగా హైదరాబాద్
అద్భుత నగరమైన హైదరాబాద్ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీహబ్ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
టీహబ్ దేశానికే తలమానికం
యువ భారతీయులకు అంకితం
యువత, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం: సీఎం కేసీఆర్
ప్రపంచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్-2 ఘనంగా ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: అద్భుత నగరమైన హైదరాబాద్ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీహబ్ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాంకేతిక కేంద్రాన్ని స్థాపించి.. దేశంలో తెలంగాణ తొలి అంకుర రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ప్రపంచంతో పోటీపడుతూ గొప్ప ప్రగతిని సాధించిందని ఆయన వివరించారు. ‘‘ఆలోచనతో రండి- ఆవిష్కరణలతో వెళ్లండి’’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీహబ్-2 ఆవిష్కరణల ప్రాంగణం భారత చరిత్రలో మైలురాయి అని, అత్యుత్తమ సౌకర్యాలతో ప్రపంచ ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తుకు ఇది మార్గదర్శకమవుతుందని, యువభారత్ను ప్రపంచపటంలో ప్రముఖంగా నిలుపుతుందని, వారి అంకుర, సాంకేతిక సామర్థ్యాలను చాటుతుందన్నారు. టీహబ్-2ను దేశంలోని యువ భారతీయులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. యువతకు, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే కొత్తతరం అంకురాలను పెంచడం.. రాష్ట్రానికి, దేశానికి ప్రపంచ గుర్తింపును తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో సులభతర వ్యాపార నిర్వహణలో అంకురాలకు అండగా నిలుస్తామని, వారికి మరింత చేయూత అందిస్తామని, కొత్త ఆలోచనతో అంకురాలను స్థాపించేందుకు ముందుకొస్తే టీహబ్-2 ద్వారా సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. అంకుర ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్-2ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘టీహబ్ తెలంగాణకు గర్వకారణం. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నిరంతరంగా ఆవిష్కరణలు, అంకురాలను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే నిర్ణయం మేరకు 2015లో టీహబ్ను ప్రారంభించాం. అంకురాలను ప్రభుత్వమే ప్రోత్సహించే విధానం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రారంభమైంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్నిరోజుల ముందు టీహబ్ విస్తరించడం తెలంగాణ సాంకేతిక, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం. అంకురాలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తాయి. వాటి ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర అంకురాల విధానం ప్రగతిశీలమైంది. కార్పొరేట్, విద్యాసంస్థలతో ఫలవంతమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. అందరూ కలిసి పనిచేయడానికి, ఒకరికొకరు సహాయపడడానికి ఇది సహకరిస్తుంది. టీహబ్తో పాటు టీఎస్ఐసీ, రిచ్, టీవర్క్స్, టాస్క్, టీఫైబర్ వంటి సంస్థలు రాష్ట్ర ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యున్నత పర్యావరణ వ్యవస్థతో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెస్తున్నాయి.
మొదటి దశ స్ఫూర్తితో...
కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం టీహబ్. దీంతో తెలంగాణ కన్న కలలు నెరవేరుతున్నాయి. మొదటి దశలో 2వేల అంకురాలకు రూ.9,399 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వెంచర్ క్యాపిటలిస్ట్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లతో అనుసంధానం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి మన అంకురాలు విస్తరించాయి. మొదటి దశ స్ఫూర్తితో దేశ యువతను మరింత ప్రోత్సహించేందుకు, మరింత మద్దతు అందించేందుకు ప్రపంచస్థాయి ఇంక్యుబేషన్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశ కంటే రెండో దశ అయిదురెట్లు పెద్దది. ఆవిష్కరణల అనుసంధానకర్తగా, దేశ ఆవిష్కరణలు, పారిశ్రామికత స్వరూపాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ప్రపంచంలోని ఇలాంటి పది వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. నిధుల సమీకరణలో ఆసియాలోని మొదటి 15 స్థానాల్లో ఒకటిగా ఉంది. దేశంలోని అత్యుత్తమ జీవన ప్రమాణ నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. సాంకేతికత సాయంతో టీఎస్ఐపాస్, టీఎస్బీపాస్ వంటి పథకాలు పాలనపరంగా గుర్తింపు పొందడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. 2021లో తెలంగాణలోని అంకురాల విలువ రూ.37 వేల కోట్లుగా ఉంది. ఇది మరింత పెరుగుతుంది. మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, బృందం అపూర్వ కృషితోనే టీహబ్ వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పారిశ్రామిక, ఆవిష్కరణల, సాంకేతిక రంగం బలోపేతానికి కొత్త ప్రతిపాదనలు వస్తే వాటిని చేపడతాం. భవిష్యత్తులో హైదరాబాద్లో ఐటీ రంగంలో పురోగతి మరింతగా పెరుగుతుంది. దానికనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు అధికారులు దృష్టి సారించాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఆవిష్కరణ జ్యోతిని సీఎం కేసీఆర్కు అందజేశారు.పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కల ఇప్పటికి సాకారమైందని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా టీహబ్ ఆరంభించిన కొద్ది కాలంలోనే ప్రపంచ గుర్తింపు పొందిందని, ఆ తర్వాత డిమాండ్ పెరగడంతో రెండో దశ చేపట్టామని, ప్రారంభానికి ముందే దానికి విశేష ఆదరణ లభించిందన్నారు. టీహబ్ సీఈవో శ్రీనివాస్రావు మాట్లాడుతూ టీహబ్తో పలు రాష్ట్రాలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని, పలు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. టీహబ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ టీహబ్ ఆధునిక సాంకేతిక విప్లవమని, దేశానికి గొప్ప మార్గాన్ని చూపిందని చెప్పారు.
హైదరాబాద్లో కొత్త టీ-హబ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అభినందనలు. భారత స్టార్టప్ల పర్యావరణ వ్యవస్థకు ఇది గొప్ప ఊతమిస్తుంది.
-రతన్టాటా
ఘనంగా ప్రారంభం
టీహబ్-2 ప్రపంచ ఆవిష్కరణ కేంద్రం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ టీహబ్ కొత్తభవన ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణమంతా కలియదిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాల వివరాలు తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ టీహబ్ ప్రత్యేకతలను సీఎంకు వివరించారు. గేమింగ్, యానిమేషన్, సినిమాల్లో త్రీడీ ఎఫెక్టుల వంటి రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలన్నీ హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించిన మంత్రి కేటీఆర్తో పాటు, అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకునే దిశగా, సైబర్ క్రైంను అరికట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూంను మరింతగా అభివృద్ధి చేసేందుకు టీహబ్తో సమన్వయం చేసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్దన్రెడ్డి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
యానికార్న్ అంకుర సంస్థలకు సన్మానం
దేశంలోని ప్రముఖ యూనికార్న్ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, తెలంగాణలోని ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను, టీహబ్ నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం శాలువాలతో సన్మానించారు. టీహబ్ జ్ఞాపికలను బహూకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట