నాణ్యత నీటిపాలు
పదికాలాలపాటు ఆయకట్టుకు సాగునీరు.. సమీప గ్రామాలకు తాగునీరు అందించాల్సిన జలాశయం నిర్మాణ పనుల్లో నిండా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నల్గొండ జిల్లాలో ఆర్.విద్యాసాగర్రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్
నిర్లక్ష్యంగా డిండి శివన్నగూడెం జలాశయం పనులు
నీళ్లు నిల్వ ఉండగానే సీవోటీ నిర్మాణం
భవిష్యత్తులో జలాశయం దిగువన బుంగలు, ఊట ఏర్పడే ప్రమాదం
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-మర్రిగూడ: పదికాలాలపాటు ఆయకట్టుకు సాగునీరు.. సమీప గ్రామాలకు తాగునీరు అందించాల్సిన జలాశయం నిర్మాణ పనుల్లో నిండా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నల్గొండ జిల్లాలో ఆర్.విద్యాసాగర్రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడెం జలాశయం పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఆనకట్ట భద్రతతో పాటు దిగువ ప్రాంతాల రక్షణకు కీలకమైన సీవోటీ(కట్ ఆఫ్ ట్రెంచ్) నిర్మాణం నీటిపారుదలశాఖ ఇంజినీర్ల పర్యవేక్షణ లోపం కారణంగా నీళ్లలో సాగుతోంది. కట్ట దిగువన తవ్విన సీవోటీ ట్రెంచ్లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చేరింది. దాన్ని పూర్తిస్థాయిలో తొలగించిన అనంతరం పనులు చేయాల్సి ఉండగా హడావిడిగా చేపడుతున్నారు.
ఏం జరుగుతోందంటే..
డిండి ఎత్తిపోతలలోని చివరి జలాశయం.. ‘శివన్నగూడెం’. నిల్వ సామర్థ్యం 11.96 టీఎంసీలు. మర్రిగూడ మండలం చెర్లగూడెం, శివన్నగూడెం గ్రామాల మధ్య ప్యాకేజీ 6, 7లలో భాగంగా రూ. 1,519 కోట్లతో ఈ జలాశయం పనులు చేపట్టారు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని 10 మండలాల పరిధిలో 1.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. 2015లో మొదలైన పనులు నిర్వాసితుల అడ్డగింత తదితర కారణాలతో ఆగుతూ.. సాగుతున్నాయి. ప్రస్తుతం కట్ట పూర్తి కావచ్చింది. దాని లోపలివైపు సీవోటీ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ట్రెంచ్ తవ్వారు. దాని అడుగుభాగం నుంచి నల్లమట్టి నింపుతూ వస్తున్నారు. వర్షాలతో ట్రెంచ్లో చేరిన నీటిని తొలగించకుండానే కొద్ది రోజులుగా పనులు చేస్తున్నారు. నీటి తోడివేతకు ఒకటీ రెండు మోటార్లను పేరుకే ఏర్పాటు చేశారు. నీళ్లలోనే మట్టి వేసి చదును చేస్తున్నారు. రోలర్లతో తొక్కించాల్సి ఉన్నా అలా చేయడం లేదు.
ఇలా చేయాలి..
జలాశయ నిర్మాణంలో సీవోటీ కీలకం. కట్ట ఎత్తు, నిల్వ సామర్థ్యాన్ని అనుసరించి.. దాని లోపలివైపు లోతు నుంచి మట్టి తవ్వాలి. కట్టను బలోపేతం చేస్తూ నిర్మించాలి. దాదాపు ప్రతి మీటరులోపే ఒక పొర మట్టి వేసి భారీ యంత్రాలతో(రోలర్లు) తొక్కించాలి. ప్రతి పొరకు సాంద్రత(డెన్సిటీ) 98 శాతం ఉండాలి. నీళ్లు అసలు ఉండకూడదు. మట్టిని రోలింగ్ చేసేందుకు మాత్రం కొంత తేమ ఉండేలా చూస్తారు. కానీ, శివన్నగూడెం పనులు నీటిలోనే జరుగుతున్నాయి. సీవోటీ బలహీనంగా ఉంటే మట్టి పొరల మధ్య ఖాళీలతో భవిష్యత్తులో కట్ట దిగువన లీకేజీలు, బుంగలు, ఊట లాంటివి ఏర్పడే ప్రమాదముంది.
‘నీరంతా వెళ్లిపోయాకే పనులు’
పనుల తీరుపై నీటిపారుదల శాఖ డిండి ఎత్తిపోతల కార్యనిర్వాహక ఇంజినీర్ రాములు నాయక్ను ‘ఈనాడు’ వివరణ కోరగా... ట్రెంచ్లో చేరిన నీటికి కట్టలు వేసి మోటార్లతో తోడుతున్నామని, నీరంతా వెళ్లిపోయాకే పనులు చేస్తున్నామని తెలిపారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నీటిపారుదల శాఖ నాణ్యత పర్యవేక్షణ ఇంజినీర్లు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?