‘స్వచ్ఛ’ పురపాలికలకు రూ.రెండేసి కోట్లు
తెలంగాణలో పరిపాలన ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
పాలనలో దిక్సూచిగా మారిన తెలంగాణ
అభినందన కార్యక్రమంలో మంత్రి కె.టి.రామారావు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పరిపాలన ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వచ్చే అయిదేళ్లలో పట్టణ జనాభా 50 శాతానికి మించుతుందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ ఏడాది స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు అందుకున్న 19 పురపాలికలు, నగరపాలక సంస్థల ఛైర్పర్సన్లు, మేయర్లు, కమిషనర్లు, డిప్యూటీ ఛైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల అభినందన కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఇందులో మంత్రి కేటీఆర్ పాల్గొని అవార్డులు పొందిన వారిని సన్మానించి, అభినందించారు. అవార్డులు సాధించిడానికి దోహదపడిన పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ బృందాన్ని ప్రశంసించారు. స్వచ్ఛత అవార్డులు సాధించిన పురపాలికలకు రూ.2 కోట్ల చొప్పున ప్రోత్సాహకం అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దేశంలో మెరుగైన పాలన అందిస్తున్న పురపాలికలను అధ్యయనం చేయడానికి వెళ్లేందుకు ఈ పురపాలికల ప్రజాప్రతినిధులు, అధికారులకు అవకాశం కల్పిస్తామన్నారు.ఎంపిక చేసిన పదిమందిని జపాన్, సింగపూర్లలో పట్టణాభివృద్ధిని పరిశీలించేందుకు పంపించనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ పురపాలక అవార్డుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. స్పష్టమైన సంకల్పం, ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే రాష్ట్రానికి గ్రామీణ, పట్టణ స్వచ్ఛత అవార్డులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, పురపాలకశాఖ శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వార్డు ఆఫీసర్లను నియమిస్తాం
కేంద్రం అవార్డులు, కితాబులు ఇస్తుండగా మరోవైపు అక్కడున్న వారే రాష్ట్రంలో పాలన పడకేసిందని, అస్తవ్యస్తంగా ఉందని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం వంటి అంశాలపై ప్రత్యేకదృష్టి అవసరమన్నారు. నిర్దేశించుకున్న కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో ఏ పురపాలికలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.12 వేలకంటే తక్కువ జీతం ఇవ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు.వారికి భద్రత పరికరాలను విధిగా ఇవ్వాలన్నారు.సిరిసిల్లలో పొడి చెత్తను రీసైకిల్ చేసి అమ్మడం ద్వారా నెలకు రూ 8.35 లక్షల అదనపు ఆదాయం పొందుతున్నారని, దీన్ని ఇతర పురపాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆస్కి ఆధ్వర్యంలో 20 స్టార్టప్లను పురపాలికలతో అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పురపాలికల్లో 3712 మంది వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. పురపాలకశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, స్థానిక సంస్థలకు ప్రత్యేక అదనపు కలెక్టర్లను నియమించిన ఘనత తెలంగాణదే అని అన్నారు. రాష్ట్రానికి ఎన్జీటీ జరిమానాపై మాట్లాడుతూ.. మురుగునీటి శుద్ధి సహా వివిధ అంశాలపై సమాచార లోపంతోనే ఇలా జరిగిందని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ వివరించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ అంశాలను ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..