యాదాద్రి విద్యుత్తు కేంద్రం పర్యావరణ అనుమతిపై మళ్లీ అధ్యయనం
యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై శాఖ ఆదేశాలు జారీచేసింది.
తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలి
అప్పటివరకూ భారీ యంత్రాల అమరిక, విద్యుదుత్పత్తి వద్దు
చెన్నై ఎన్జీటీ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై శాఖ ఆదేశాలు జారీచేసింది. తొమ్మిది నెలల్లో నివేదిక పూర్తిచేసి ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. అప్పటివరకు కేంద్రం ఇచ్చిన అనుమతిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ లోపు ప్లాంటు సాధారణ నిర్మాణాలు చేపట్టవచ్చంది. భారీ యంత్రాలు అమర్చకూడదని, నిర్మాణం పూర్తయినా విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించకూడదని ఆదేశాలిచ్చింది.
ముంబయికి చెందిన ది కన్జర్వేషన్ ఆఫ్ యాక్షన్ ట్రస్టు అనే సంస్థ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర అటవీశాఖకు కొన్ని సూచనలు చేసింది. భవిష్యత్తులో థర్మల్, అణు విద్యుత్తు ప్లాంట్లు, ప్రమాదకారక (రెడ్ కేటగిరీ) పరిశ్రమల కోసం అటవీ భూములను ఇవ్వకూడదంది. యాదాద్రి ప్లాంటు ప్రదేశాల్లో రేడియోధార్మిక ఉద్గారాల స్థాయి, బూడిద కుంటల నిర్మాణం, డిజైన్, నిర్వహణ, ప్రాజెక్టుకు 25 కి.మీ చుట్టూ గాలిలో నాణ్యత, దాని ప్రభావం వంటి అంశాలపై అధ్యయనం చేయాలని వెల్లడించింది. ప్రాజెక్టు ప్రాంతం నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంత సరిహద్దు ఎంత దూరంలో ఉందనే విషయమై కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ ప్రక్రియ జెన్కో, నిపుణుల అప్రైజల్ కమిటీ (ఈఏసీ), కేంద్ర పర్యావరణశాఖ తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఎన్జీటీ సూచించిన ఆయా అంశాలపై అధ్యయనం తరువాత, కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలు, నివేదిక మేరకు తదుపరి అనుమతులు ఉంటాయని తేల్చిచెప్పింది.
ప్లాంటు నిర్మాణం కొనసాగుతుంది
- ప్రభాకరరావు, సీఎండీ, జెన్కో
తెలంగాణ ప్రభుత్వానికి, జెన్కోకు ఎన్జీటీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్ర అటవీశాఖకు సూచనలు చేసింది. థర్మల్ ప్లాంటుకు 10కి.మీ దూరంలో రక్షిత అటవీ ప్రాంతం ఉంటే ఈ నిబంధనలు వర్తిస్తాయి. యాదాద్రి పవర్ ప్లాంటుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతం 10 కి.మీ అవతల ఉందని కేంద్ర అటవీశాఖ స్పష్టంగా వెల్లడించింది. నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే కేంద్ర పర్యావరణ అనుమతి లభించింది. దానికి సూచనలు (టీవోఆర్)జారీ చేస్తూ.. మరోసారి అధ్యయనం చేయాలన్న ఆదేశాలు..తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. ప్లాంటుకు టైగర్ రిజర్వు దగ్గర్లో లేనందున, ఎన్జీటీ ఉత్తర్వుల ప్రభావం ఉండబోదు. యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని కొనసాగిస్తాం.
ఆపేందుకు కుట్ర
- మంత్రి జగదీశ్రెడ్డి
అన్ని చట్టాలకు లోబడే పవర్ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. దాన్ని ఆపేందుకు అదృశ్య శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ఎన్జీటీ తీర్పు ఏకపక్షంగా, దేశానికి నష్టం కలిగించేలా ఉంది. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలన్నీ పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి. ముంబయి సంస్థకు యాదాద్రి ప్లాంట్తో సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ఎన్జీటీ కొట్టివేసింది. తాజా తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం. అనుకున్న సమయానికి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్