Telangana News: ఎవరి లక్ష్యం వారిదే..!
రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ, ఈడీల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది.
మంత్రులపై కేంద్ర సంస్థల గురి
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా ముఖ్యనాయకులపై సిట్ దృష్టి
రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హల్చల్
‘తర్వాత ఎవరి వంతో’ అనే చర్చ
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ, ఈడీల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఒక మంత్రిపై గ్రానైట్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరపగా, అది ముగియకముందే మరో మంత్రి లక్ష్యంగా మంగళవారం పెద్దఎత్తున ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుడిని కూడా ఈడీ విచారించింది. మరికొందరిపైనా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. కొందరు నేతలు బహిరంగంగానే అంటున్నారు కూడా. మునుగోడు ఉపఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంటుందని అందరూ భావించగా, అందుకు భిన్నంగా ఈడీ, ఐటీ, సిట్ కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. సీబీఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో అది నేరుగా కేసులు నమోదు చేయలేకపోతోందని, లేకుంటే ఆ సంస్థ కూడా రాష్ట్రంలో చురుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఏకపక్షంగా దాడులు చేయగలిగాయి. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
* దిల్లీ మద్యం విధానం తయారీలో భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ మొదట రాష్ట్రంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును భాజపా నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నెలరోజులకు పైగా ఈ ప్రచారం ఉన్నా ఈడీ అక్కడివరకు రాలేదు. అయితే ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.
* ఎమ్మెల్యేల ఎర కేసును తీవ్రంగా తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడమే కాదు..ఇప్పటికే భాజపాలో కీలకనేతగా ఉన్న బి.ఎల్.సంతోష్ను విచారణకు పిలుస్తూ నోటీసు ఇచ్చింది. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విచారణను నిలిపివేయించేందుకు భాజపా నాయకులు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరికొందరు ముఖ్యనాయకులకూ నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి కేంద్రంలోని మంత్రులు, ఆర్.ఎస్.ఎస్. నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారు కలిసి ఉన్న ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
* కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారులు రాయల్టీ ఎగ్గొట్టినట్లు 2013లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇచ్చింది. గ్రానైట్ ఎగుమతికి సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా ఈడీ దాడులు చేసింది.
* క్యాసినో వ్యహారంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులిద్దరినీ, ఆయన వ్యక్తిగత సహాయకుడిని కూడా విచారించారు.
* అధిక సంఖ్యలో విద్యాసంస్థలున్న మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో మంగళవారం పెద్దఎత్తున ఐటీ దాడులు జరిగాయి. మరికొందరు మంత్రులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు నాయకులకు విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తెరాస లక్ష్యంగా మరికొన్ని సోదాలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
వాణిజ్య పన్నుల అధికారులు సైతం..
* దర్యాప్తు సంస్థలే కాదు, వాణిజ్య పన్నుల అధికారులు కూడా తనిఖీలు ప్రారంభించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేయగా, తెరాస నాయకులకు చెందిన సంస్థలపై కేంద్ర జీఎస్టీ అధికారులు చేశారు. మరికొన్ని ప్రముఖ వ్యాపార సంస్థల్లో జీఎస్టీ, ఆదాయపన్ను శాఖ సోదాలు జరిగాయి. దీంతో వ్యాపార సంస్థల పరిస్థితి మరింత ఇబ్బందిగా తయారైంది. ఎప్పుడు ఎటువైపు నుంచి సోదాలు జరుగుతాయో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఒక పార్టీకి సన్నిహితంగా ఉండటమో, ఆర్థిక సాయం చేశారన్న అనుమానమో ఉంటే ఇంకోవైపు నుంచి సోదాలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హల్చల్ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?