కాలం చెల్లిన మాస్టర్ ప్లాన్లే
రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తుండగా.. వాటి అభివృద్ధిలో అత్యంత కీలకమైన మాస్టర్ప్లాన్ల రూపకల్పనలో ఉదాసీనత వ్యక్తమవుతోంది.
అస్తవ్యస్తంగా పట్టణ ప్రణాళికలు
కొత్తవి తయారు చేసినా.. అమోదించడంలో తాత్సారం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తుండగా.. వాటి అభివృద్ధిలో అత్యంత కీలకమైన మాస్టర్ప్లాన్ల రూపకల్పనలో ఉదాసీనత వ్యక్తమవుతోంది. కాలంచెల్లిన ‘ప్రణాళిక’లనే నగర, పుర పాలకసంస్థలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో 13 నగరపాలక, 128 పురపాలక సంఘాలు ఉండగా 80కి పైగా పట్టణాలు, నగరాలకు కొత్త మాస్టర్ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ విషయంలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన వరంగల్కు 1972 నాటి మాస్టర్ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండగా నిజామాబాద్కు 1974 నాటి ‘ప్రణాళికే’ దిక్కయింది. పదికిపైగా పురపాలికల్లో 1990 కంటే ముందునాటి మాస్టర్ప్లాన్లే అమల్లో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లో నాలుగేళ్లు పూర్తవుతున్నా బృహత్ ప్రణాళికల రూపకల్పన జరగడం లేదు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంస్థలకు కొత్త మాస్టర్ప్లాన్లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినా కార్యాచరణ మాత్రం ముందుకు సాగడంలేదు. రాష్ట్రంలో 10 ‘అమృత్’ పట్టణాలకు కొత్తగా మాస్టర్ప్లాన్లను రూపొందించినా అవి అమలుకు నోచలేదు. పెరుగుతున్న జనాభా, ప్రాంతాల విస్తరణకు అనుగుణంగా కనీసం 20 ఏళ్లకోసారి మాస్టర్ప్లాన్లను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలోని 141 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్ప్లానింగ్ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు బృహత్తర ప్రణాళిక (మాస్టర్ప్లాన్)ల రూపకల్పనకు అనుమతి లభించగా.. 23 ఆ ప్రక్రియను చేపట్టాయి. వీటిలో ఎనిమిది మాత్రం ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించగా.. పెద్దపల్లి పురపాలక సంఘం మాస్టర్ప్లాన్కు మాత్రం ఆమోదం లభించింది. అలాగే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 44 పురపాలికలు ఉండగా.. 17 తెలంగాణ పురపాలక అభివృద్ధి కార్యక్రమం ద్వారా మాస్టర్ప్లాన్ల రూపకల్పన చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. కొన్ని ప్రాథమిక మ్యాప్ల తయారీ వద్దే ఉండగా మరికొన్ని ముసాయిదాల స్థాయిలో ఉండిపోయాయి. సాధారణంగా కొత్త పురపాలక సంఘం ఏర్పాటైతే నాలుగు సంవత్సరాలలోపు మాస్టర్ప్లాన్ను రూపొందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 59 పురపాలక సంఘాలు ఏర్పాటై నాలుగు సంవత్సరాలు దాటినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
వరంగల్లో 50 ఏళ్ల నాటి ప్లాన్
10 లక్షలకు మించిన జనాభా ఉన్న వరంగల్లో 50 ఏళ్ల నాటి మాస్టర్ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. రెండేళ్ల క్రితం కొత్తది రూపొందించారు. ముసాయిదా ప్రచురించి కార్పొరేషన్ తీర్మానంతో ప్రభుత్వానికి పంపించారు. దానికి ప్రభుత్వ ఆమోదం ఇప్పటికీ రాలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మాస్టర్ప్లాన్ కూడా 48 ఏళ్ల నాటిది కావడం గమనార్హం. ఏడాది క్రితమే మాస్టర్ప్లాన్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించినా ముసాయిదా స్థాయిని దాటి ముందుకు వెళ్లలేదు.
ఆ ప్రణాళికలు ఎందుకు?
* ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి.
* భవిష్యత్లో విస్తరణను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం.
* నిర్దేశించుకున్న మార్గంలో పట్టణాభివృద్ధి.
* ఆర్థికాభివృద్ధికి మార్గం.
* మెరుగైన రవాణా, సేవలు.
* పర్యావరణ హితంగా ప్రగతి.
* ప్రత్యేక జోన్ల ఆధారంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన