BF7: బీఎఫ్ 7పై ఆందోళన వద్దు
గత ఏడాది జులై, ఆగస్టు నెలల నాటి మూడోదశ కొవిడ్ ఉద్ధృతి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సమయంలో.. ఇప్పుడు నాలుగో దశ మొదలవుతోందన్న సంకేతాలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.
అధిక జనసాంద్రత ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశాలు
మాస్కు తప్పనిసరిగా ధరించాలి
బూస్టర్ డోసు టీకాతో కచ్చితమైన రక్షణ
‘ఈనాడు’తో ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి
ఈనాడు- హైదరాబాద్: గత ఏడాది జులై, ఆగస్టు నెలల నాటి మూడోదశ కొవిడ్ ఉద్ధృతి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సమయంలో.. ఇప్పుడు నాలుగో దశ మొదలవుతోందన్న సంకేతాలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం దేశంలో బయటపడుతున్న కొత్తరకం ఒమిక్రాన్ వైరస్ బీఎఫ్ 7 రకం భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో విరుచుకుపడుతున్న ఈ వైరస్ కేసులు భారత్లోనూ వెలుగు చూశాయి. ఈ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెంది అత్యధిక మరణాలకు దారితీస్తోందని, దీని లక్షణాలు సాధారణ కొవిడ్ మాదిరిగా కనిపించవని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకోవడంతో.. జనం బెంబేలెత్తే పరిస్థితి. ఈ ప్రచారంలో వాస్తవాలు లేవని, వాటిలో శాస్త్రీయత లేదని ఇన్ఫెక్షన్ వ్యాధుల (ఇన్ఫెక్షియస్ డిసీజెస్) నిపుణురాలు, అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సునీత నర్రెడ్డి కొట్టిపారేశారు. చైనాలో విజృంభించినంతగా బీఎఫ్ 7 ఉద్ధృతి మన దగ్గర కొనసాగే అవకాశాలు తక్కువని చెప్పారు. కానీ దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతా వంటి జనసాంద్రత అధికంగా ఉండే మహానగరాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషించారు. ఈ వైరస్పై నెలకొన్న సందేహాలను ఆమె ‘ఈనాడు’ ముఖాముఖిలో నివృత్తి చేశారు.
చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్ 7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ ప్రభావం మన దగ్గర ఎలా ఉండబోతోంది?
చైనాలో మొదట్నించీ లాక్డౌన్ నడుస్తోంది. అక్కడి ప్రజల్లో వైరస్ బారినపడిన వారి శాతం చాలా తక్కువ. దీంతో సహజసిద్ధంగా లభించే రోగ నిరోధక శక్తి చైనీయుల్లో కొరవడింది. వైరస్ మార్పులకు అనుగుణంగా ఆ దేశ టీకాలను అభివృద్ధి చేయకపోవడంతో అవి కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇలా రెండు రకాలుగా చైనా ప్రజల్లో రోగనిరోధకశక్తి సన్నగిల్లడంతో వైరస్ విజృంభిస్తోంది. భారత్లో రెండోదశలో డెల్టా వేరియంట్ వ్యాపించిన సందర్భంలో మనం చూసిన తీవ్రతనే ఇప్పుడు చైనాలోనూ ఎదుర్కొంటున్నారు. మన దేశంలో దాదాపు అర్హులైన వారంతా రెండు డోసుల టీకాలు పొందారు. పెద్దఎత్తున ఇన్ఫెక్షన్ బారిన కూడా పడ్డారు. దీంతో సహజసిద్ధంగా లభించే హెర్డ్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది. బీఎఫ్ 7 అనేది భారత్లో కొత్తగా వచ్చిందేమీ కాదు. సెప్టెంబరు నుంచే ఇక్కడ వ్యాప్తిలో ఉంది. మూడు నెలలు దాటినా, ఉద్ధృతి కనిపించలేదు. కొత్తగా కేసులు పెరిగేదేముంది?
కొవిడ్ తొలిదశలో.. చైనాలో మన కంటే ముందుగా నవంబరు 2019లో వైరస్ విజృంభించింది. తర్వాత భారత్లో 2020 మార్చి, ఏప్రిల్లో వైరస్ జాడలు కనిపించాయి. ఇప్పుడు కూడా అలా వచ్చే నాలుగైదు నెలల్లో వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయా?
ఇప్పుడు కొత్త రకం వైరస్ భారత్లో ప్రవేశించి మూణ్నెల్లు దాటినా కేసుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల లేదు. కొవిడ్కు ముందు మాదిరే ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే.. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువే. ఒకవేళ పెరిగితే వచ్చే జనవరికల్లా తెలుస్తుంది. కానీ 2020, 2021లో మాదిరిగా కేసులు పెరగవు. మన దగ్గర వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువే. మనవద్ద ఎప్పటికప్పుడు వైరస్ జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్ సీక్వెన్సింగ్) పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో ఏదైనా కొత్తరకం ప్రమాదకరంగా ఉందని తేలితే.. వెంటనే అప్రమత్తమయ్యేందుకు భారత్లో అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో పటిష్ఠ యంత్రాంగాన్ని నెలకొల్పింది.
అమెరికా, యూరప్ దేశాల్లోనూ వ్యాక్సిన్లు ఇచ్చారు.. అయినా అక్కడ ఎందుకు కేసులు పెరుగుతున్నాయి?
రెండు, మూడు దశల కొవిడ్ తీరును పరిశీలిస్తే.. మన కంటే అమెరికా, యూరప్ దేశాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ దేశాల కంటే మన దగ్గర మరణాలు, తీవ్రత తక్కువే. బహుశా ఉష్ణ ప్రాంతాల్లో ఉండడం వల్ల కావచ్చు.. భారత్ వంటి దేశాల్లో జనం చిన్నతనం నుంచే రకరకాల అంటువ్యాధుల బారినపడుతుంటారు. అందుకే వారిలో సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి వృద్ధి చెంది ఉండొచ్చని ఒక అంచనా.
బీఎఫ్ 7 రకం ఒమిక్రాన్లో గతంలో మాదిరి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండవు అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంత?
బీఎఫ్ 7 దగ్గు, జ్వరం రావని.. కీళ్ల నొప్పులు, తల, మెడ, వీపునొప్పి, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలతో బయటపడుతుందని, డెల్టా కంటే 5 రెట్లు ప్రమాదకరమైందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అత్యధిక మరణాలు సంభవిస్తాయనే భయాందోళనలు సృష్టిస్తున్నారు. ముక్కుద్వారా చేసే పరీక్షల్లోనూ బయటపడదని, నొప్పులు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఎక్స్రేలో మాత్రం ఛాతీలో న్యుమోనియా ఉన్నట్లు బయటపడుతుందని అపోహలు కల్పిస్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలే. బీఎఫ్ 7 సోకితే.. సాధారణ కొవిడ్ లక్షణాలే ఉంటాయి. ముక్కుద్వారా సేకరించే నమూనాల్లోనే బయటపడుతుంది.
ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆందోళన అవసరం లేదు. అలా అని ఉదాసీనంగా వ్యవహరిస్తే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కనీస జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. మాస్కులు తప్పనిసరి. జన సమూహాల్లోకి వెళ్లకూడదు. భౌతికదూరం పాటించాలి. తరచూ చేతులు శుభ్రపర్చుకోవాలి. 2 డోసుల టీకా వేసుకున్న తర్వాత కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో చాలామంది బూస్టర్డోసు తీసుకోలేదు. అలాంటి వారంతా తప్పకుండా బూస్టర్డోసు వేయించుకోవాలి. రెండు డోసులు పూర్తయి చాలాకాలమైనా.. బూస్టర్ తీసుకుంటే రక్షణ లభిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే.. వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్ అని తేలితేనే బయటకు రావాలి. లేదంటే లక్షణాలు తగ్గేవరకు ఇంటి పట్టునే వైద్యం పొందుతూ ఉండాలి. ఆరోగ్యం విషమిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..