వీడని అకాల వర్షం
వేసవి కాస్త వర్షాకాలంలా మారింది. ఏసీలు.. కూలర్లతో సేదతీరాల్సిన తరుణంలో చలి వాతావరణం నెలకొంది. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
సూర్యాపేట జిల్లాలో గరిష్ఠంగా 7.6 సెం.మీ నమోదు
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వడగళ్లు
చేతికొచ్చే దశలో పంట నష్టం
నేడూ వానలు కురిసే అవకాశం
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, యంత్రాంగం: వేసవి కాస్త వర్షాకాలంలా మారింది. ఏసీలు.. కూలర్లతో సేదతీరాల్సిన తరుణంలో చలి వాతావరణం నెలకొంది. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలుజిల్లాల్లో వడగళ్లు పడటంతో పంట, ఆస్తినష్టం సంభవించింది. ఉదయం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అలంగపురంలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వడగళ్లతో బెంబేలు
రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వడగళ్లు పడ్డాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వడగళ్లు పడటంతో ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. నగరంలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్ గౌరెల్లిలో వడగళ్ల ధాటికి ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. కిలోన్నర నుంచి 2 కిలోల బరువున్న వడగళ్లు రేకుల ఇళ్లపై పడటంతో పైకప్పులు జల్లెడల్లా మారాయి. మొత్తం 9 మంది తలలు పగిలాయి. వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
22 వేల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రవ్యాప్తంగా వానల వల్ల శుక్రవారం 22 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. రూ.80 కోట్ల మేర పంటనష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. వికారాబాద్, సంగారెడ్డితో పాటు ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మిర్చి, వేరుసెనగ, మినుము పంటలతో పాటు మామిడి, బత్తాయి, టమాటా, బీర, పుచ్చతోటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 62 గ్రామాల్లో 2633 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, మామిడి, ఉల్లి, టమాటా, పుచ్చ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో 1516 మంది రైతులు 3193 ఎకరాల్లో కోటి రూపాయలకు పైగా విలువైన పంటను కోల్పోయారు. టమాటా, ఉల్లి, వంగ, మామిడి, అరటి, మిర్చి, క్యాబేజీ పంటలు దెబ్బతిన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1923 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం 3012, ఉమ్మడి నల్గొండ 3130, ములుగు 1921, భూపాలపల్లి జిల్లాలో 913 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పంట నష్టంపై సర్వే చేయాలి: కూనంనేని
ఈనాడు, హైదరాబాద్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సర్వే చేసి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలన్నారు. పిడుగుపాటుతో చనిపోయిన మూగజీవాలకు, పశుకాపరులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గత పదేళ్లలో లేనంతగా పగటిపూట రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం నల్గొండలో సాధారణం కన్నా 9.4 డిగ్రీల సెల్సియస్ తగ్గి 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో సాధారణం కన్నా 7.3 డిగ్రీలు తగ్గి 30.8, హైదరాబాద్లో 6.7 డిగ్రీలు తగ్గి 29.9, రామగుండంలో 6.6 డిగ్రీలు తగ్గి 31.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి.
నేడు కూడా వర్షాలు
రాష్ట్రంలో ఆదివారం కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురుస్తాయని చెప్పారు. సోమవారం కూడా అక్కడక్కడా తేలికపాటి వానపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంపై ఏర్పడిన ద్రోణి ప్రభావం కొంతవరకు తగ్గిందని అంచనా వేస్తున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 8.3 మిల్లీమీటర్లు కాగా 15.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 605 శాతం, రంగారెడ్డి 412, ఖమ్మం 365, వికారాబాద్ 348, వనపర్తిలో 286 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా