పత్తి విత్తు.. నకిలీల విపత్తు
రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా రవాణా అవుతున్నాయి.
తెలంగాణ మార్కెట్ విత్తన మాఫియా విజృంభణ
మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, గుజరాత్ల నుంచి సరఫరా
ప్రముఖ కంపెనీల పేరిట ఏజెంట్లతో విక్రయాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా రవాణా అవుతున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని వందల సంఖ్యలో వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా వీటిని విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు పెద్దఎత్తున నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నాయి.
రెండో పెద్ద పంట..
తెలంగాణలో వరి తర్వాత రెండో ప్రధాన పంట పత్తి. 2021లో 43 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. 2022లో 50 లక్షల ఎకరాలకు చేరింది. ఈ ఏడాది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పత్తి ఎగుమతుల్లో పెరుగుదల, దేశీయ మార్కెట్లో డిమాండ్లు, రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు, జౌళి పార్కులు పెరగడంతో పత్తి సాగు ఊపందుకుంటోంది. ఇది వర్షాధార పంట కావడంతో జూన్ రెండో వారంలో విత్తుకునేందుకు నెల ముందు నుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల కోసం 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం. ఇందులో బీటీ-1, బీటీ-2 రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. ప్రభుత్వపరంగా సరఫరా మాత్రం లేదు. ప్రముఖ, స్థానిక కంపెనీలవే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా బీటీ-2 రకం వాడకంలో ఉంది. బీటీ-3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా కాపుకొస్తుందని మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు.
వ్యాపారులకు కమీషన్
ఆయా రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలు తయారు చేయించి, ప్రధాన కంపెనీల తరహాలో ముద్రించిన ప్యాకెట్లలో వేసి తెలంగాణకు రవాణా చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల వ్యాపారులకు కమీషన్ ఇస్తామని నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేలా చేస్తున్నారు. వ్యాపారులు ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో అమ్మకం చేయిస్తున్నారు. విత్తనం కొనుగోలు చేసిన సమయంలో రసీదు, బిల్లు తీసుకోవాలని అధికారులు చెబుతున్నా రైతులు పాటించడం లేదు. తరువాత సరైన పూత, కాత రాక మోసపోయామని గుర్తించినా వ్యాపారులను ప్రశ్నించడానికి ఆధారాలు ఉండటం లేదు.
టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాకే..
ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు, కర్ణాటకలోని యాద్గిర్, బీదర్, మహారాష్ట్రలో నాగ్పుర్, పుణె, నాందేడ్ల మీదుగా పత్తి విత్తనాలు తెలంగాణకు చేరుతున్నాయి. సరిహద్దుల్లో చెక్పోస్టుల గుండా విత్తనాలు చేరుతున్నా కట్టడి జరగడం లేదు. రైళ్లలోనూ భారీగా అక్రమ రవాణా జరుగుతున్నా అక్కడా తనిఖీల్లేవు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు, వ్యవసాయాధికారులతో సంయుక్త టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ముఠాలు దొరుకుతున్నాయి. పక్షం రోజుల వ్యవధిలో రాచకొండ, సైబరాబాద్, వరంగల్లోని టాస్క్ఫోర్స్ బృందాలు బాలానగర్, దుండిగల్, చౌటుప్పల్, మడికొండ, గీసుగొండ తదితర ప్రాంతాల్లో 20 టన్నుల మేర నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నాయి. దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. దాడులను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది.
ఏటా ధరల పెంపు, కృత్రిమ కొరత
బ్రాండెడ్ పత్తి విత్తనాల ధర ఏటా పెరుగుతుండటం నకిలీ విత్తనాల వ్యాపారులకు వరంగా మారింది. ఈ ధరను కేంద్ర ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. మరోవైపు ఇవి విరివిగా లభించడమూ లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరను అమాంతం పెంచి విక్రయిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఒక ప్యాకెట్ను రూ.1500- రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?