గజ్వేల్‌, సిద్దిపేటలకు గోదావరి జలాలను ఎందుకు మళ్లిస్తున్నారు?: మంత్రి పొన్నం

గోదావరి నీటిని గజ్వేల్‌, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు మళ్లిస్తుండటంపై హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated : 08 Feb 2024 09:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి నీటిని గజ్వేల్‌, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు మళ్లిస్తుండటంపై హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తయినట్లు గత ప్రభుత్వం ప్రకటించిందని, ఇంకా గోదావరి నీటిని ఎలా తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి పరిధిలోని పౌర సేవలపై ఆయన బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఉప మేయర్‌ శ్రీలతరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.

‘‘హైదరాబాద్‌ నీటిని నగరానికే వాడాలి. రాజధానికి వచ్చే నీటిని మధ్యలో 40 ఎంజీడీలను దారి మళ్లించడం సరికాదు. దీనిపై వెంటనే పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడండి’’ అని ఆదేశించారు. వాస్తవానికి గోదావరి నుంచి నిత్యం నగరానికి 172 ఎంజీడీలను తరలిస్తుండగా.. అందులో 40 ఎంజీడీల వరకు గజ్వేల్‌, సిద్దిపేటకు కేటాయిస్తున్నారు. ఈ నీటి తరలింపునకు అయ్యే విద్యుత్తు ఛార్జీల భారాన్ని జలమండలి భరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నీటి సమస్యను వేగంగా పరిష్కరించి, గోదావరి జలాలను 100 శాతం హైదరాబాద్‌కు వినియోగించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు