Pregnant Women: చికిత్సలో ప్రమాణాలు ముఖ్యం
కరోనా పరిస్థితుల నేపథ్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసేందుకు, ప్రసవాల సమయంలో తగిన ప్రమాణాలను పాటించాలని... అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీచేశారు. పీపీఈ కిట్, ఫేస్ మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించి చికిత్స అందించాలని అధికారులు, వైద్యులు, ఇతర సిబ్బందికి సూచించారు
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు, ప్రసవాలు
పీపీఈ, ర్యాట్ కిట్లు అందుబాటులో ఉంచుకోండి
సిబ్బందికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసేందుకు, ప్రసవాల సమయంలో తగిన ప్రమాణాలను పాటించాలని... అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీచేశారు. పీపీఈ కిట్, ఫేస్ మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించి చికిత్స అందించాలని అధికారులు, వైద్యులు, ఇతర సిబ్బందికి సూచించారు. ఈమేరకు ఎయిమ్స్, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తదితర సంస్థలు కలిసి రూపొందించిన ప్రమాణాలపై చర్చించి తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్వో), ఆసుపత్రుల సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకొని వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశు, ప్రసవం, ప్రసవం తర్వాత అనే మూడు దశల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మార్గదర్శకాల్లో కీలకమైనవి..
* గర్భస్థ శిశు దశలో చెకప్నకు రెండు రోజుల ముందు ఏబీఎం, ఆశా కార్యకర్త గర్భిణిని కలిసి ఎంసీపీ కార్డులో వివరాలు నింపాలి. ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చి పరీక్షించుకునేలా చూడాలి. వారు మిగిలిన రోగుల్లో కలవకుండా, ఎక్కువ సమయం వేచి ఉండకుండా టోకెన్లు ఇచ్చి సమయానికి వైద్య పరీక్షలు చేయించాలి. భౌతికదూరం పాటించేలా ఉపకేంద్రంలో కుర్చీలు ఏర్పాటుచేయాలి. వైద్యాధికారులు అన్ని మందుల్ని, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలి.
* ప్రసవానికి 5-7 రోజుల ముందు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు (ర్యాట్) చేయాలి. నెగెటివ్, అనుమానాస్పద, పాజిటివ్గా గర్భిణులను విభజించి వారికి వైద్య పరీక్షలు జరపాలి. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉంటే అవసరమైతే ఫిజీషియన్ అభిప్రాయాన్ని తీసుకొని ఆరోగ్య కేంద్రం, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవం చేయాలి. ఓ మోతాదు లక్షణాలుంటే గాంధీ ఆసుపత్రికి తరలించాలి. తీవ్రంగా ఉంటే ప్రత్యేకంగా కేటాయించిన 108 అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించాలి. ప్రసూతి కేసులను పర్యవేక్షించేందుకు వరంగల్ ఎంజీఎం, నిలోఫర్, హైదరాబాద్ సుల్తాన్బజార్, హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఒక ఫిజీషియన్ను ప్రత్యేకంగా ఉంచాలి.
* తల్లి పాలలో కరోనా వైరస్ ఉంటున్నట్లు వెల్లడికాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలిచ్చే సమయంలో శిశువులకు సోకకుండా కరోనా ఉన్న తల్లులు శిశువులకు పాలు ఇచ్చే సమయంలో మాస్కు ధరించాలి. దగ్గడం, తుమ్మడం చేయరాదు. శిశువును పట్టుకునే ముందు, తర్వాత తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 5 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..