Microsoft: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా కేంద్రం
ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. దీనికోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోమవారం హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల
ఈనాడు - హైదరాబాద్
ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. దీనికోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోమవారం హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు ఈ వివరాలను తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక, వస్తున్న అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని వివరించారు. మైక్రోసాఫ్ట్ దేశంలో అతి పెద్ద డేటా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందున, స్థానికంగా ఎన్నో వ్యాపారాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు వీలవుతుందన్నారు. డేటా, నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. గత ఏడేళ్లలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కేంద్ర ఉద్యోగుల సంఖ్య 3 రెట్లు పెరిగి 9,000కు చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం క్లౌడ్ సేవలను వినియోగించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఎంతో సహకరిస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పుణె, ముంబయి, చెన్నైలలోని తమ డేటా కేంద్రాల సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ డేటా కేంద్రం తొలిదశ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తొలుత ఇది తక్కువ సామర్థ్యంతోనే ప్రారంభమైనా, దశల వారీగా అతి పెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులూ అందుకు తగ్గట్టుగానే ఉంటాయన్నారు. ఈ కొత్త కేంద్రం క్లౌడ్ను మరింత శక్తిమంతం చేయడంతో పాటు, అంకుర సంస్థలకు సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఐడీసీ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్కు దేశంలో ఉన్న 3 డేటా కేంద్రాల ద్వారా 2016-20 మధ్య 9.5 బిలియన్ డాలర్ల ఆదాయం (సుమారు రూ.71,000 కోట్లకు పైగా) ఆర్థిక వ్యవస్థకు చేరిందని, 1.50 లక్షల ఉద్యోగాలు, 1.69 లక్షల మంది నిపుణుల తయారీకి ఇవి తోడ్పాటునందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మాన్, రాష్ట్ర ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు.
రెండేళ్లలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు
దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని, దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 80 కోట్ల వరకూ ఉందని, రెండేళ్లలో ఈ సంఖ్య 120 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటలీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని, అన్ని ప్రభుత్వ విభాగాలు యాప్ల ద్వారా సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
రూ.276 కోట్లతో స్థలాల కొనుగోలు
మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న డేటా కేంద్రం కోసం మూడు స్థలాలను రూ.276 కోట్లతో కొనుగోలు చేసిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. పొత్తూరు సమీపంలోని మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందనవెళ్లిలో 52 ఎకరాలు సమకూర్చుకున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఈ లావాదేవీలను పూర్తి చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్