RTI: సమాచారం.. ఎంతెంత దూరం!
సమాచార హక్కు చట్టం కింద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కరించడానికి తెలంగాణలో నాలుగేళ్ల అయిదు నెలల సమయం.. అంటే 53 నెలలు పడుతుంది. ఒడిశాలో ఆరేళ్ల ఎనిమిది నెలలు (80 నెలలు) అవసరం.
దేశవ్యాప్తంగా భారీగా పెండింగ్ అర్జీలు
రాష్ట్రంలోనూ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన దరఖాస్తులు
సమాచారం ఇవ్వనందుకు 2 శాతం కేసుల్లోనే అధికారులపై జరిమానా
ఆంధ్రప్రదేశ్లో ఆ చర్యలూ లేవు
సహ చట్టం అమలుపై సతర్క్ నాగరిక్ సంఘటన్ నివేదికలో వెల్లడి
ఈనాడు హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కింద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కరించడానికి తెలంగాణలో నాలుగేళ్ల అయిదు నెలల సమయం.. అంటే 53 నెలలు పడుతుంది. ఒడిశాలో ఆరేళ్ల ఎనిమిది నెలలు (80 నెలలు) అవసరం. ప్రస్తుతం నెలవారీగా పరిష్కరిస్తున్న తీరును బట్టి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియ కొలిక్కి వచ్చేందుకు పట్టే సమయాన్ని సతర్క్ నాగరిక్ సంఘటన్ (ఎస్.ఎన్.ఎస్) అనే సంస్థ అంచనా వేసింది. కేసుల పరిష్కారం నత్తనడకన సాగు తుండటం..దరఖాస్తులు, అప్పీళ్లు గుట్టల్లా పేరుకుపోతుండటమే ఇందుకు కారణం. సమాచారం అందించాలని కేంద్ర కమిషన్(సీఐసీ) ఆదేశాలు ఇచ్చినా అమలు చేయనందుకు తెలంగాణలో కేవలం 2 శాతం కేసుల్లోనే సంబంధిత అధికారులకు పెనాల్టీ విధించారు. ఆంధ్రప్రదేశ్లో ఇది మరీ అధ్వానంగా సున్నాయే. మేఘాలయలో అత్యధికంగా 29 శాతం కేసుల్లో పెనాల్టీ వేసినట్లు ఎస్.ఎన్.ఎస్ తాజాగా దేశవ్యాప్తంగా సహ చట్టం అమలుపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా 95 శాతం కేసుల్లో పెనాల్టీ విధించలేదని.. కేవలం 4.9 శాతం కేసుల్లోనే వేశారని విశ్లేషించింది. సమాచారం ఇవ్వాలంటూ కమిషన్ ఆదేశాలు జారీ చేసినా అనేక రాష్ట్రాలు అమలు చేయడం లేదు. దరఖాస్తులను పరిష్కరించినట్లు చెబుతున్న సందర్భాల్లోనూ తిరస్కరించాయా లేక సమాచారం ఇచ్చాయా స్పష్టం చేయడం లేదు. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని సంస్థ పేర్కొంది.
రెండుసార్లు కమిషన్ను ఆశ్రయించినా..
హైదరాబాద్లోని ఆస్బెస్టాస్ కాలనీలో ఆక్రమణల గురించి 2016లో సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ దరఖాస్తు చేసింది. ఇవ్వకపోతే అప్పీలుకు వెళ్లింది. అయినా లాభం లేకపోవడంతో కమిషన్ వద్ద అప్పీలు చేసింది. సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. అయినా ఇవ్వలేదు. దీంతో మళ్లీ కమిషన్ను ఆశ్రయించింది. దీంతో గత అక్టోబరులో కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సమాచారం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఈ చట్టం కింద అయిదేళ్లుగా పోరాడుతున్న సంస్థకే ఈ పరిస్థితి ఎదురుకావడం గమనార్హం. ఇదో ఉదాహరణ మాత్రమే. కింది స్థాయిలోనే దరఖాస్తులను తిరస్కరించడం, అప్పీలుకు వెళ్లినా పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. సమాచారం ఇవ్వకపోయినా ఏమీ కాదులే అనే ధీమా సంబంధిత అధికారుల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం పార్లమెంటులో ఎంపీలకు ఇచ్చే ఏ సమాచారమైనా దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
నాలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పనిచేయని కమిషన్లు
పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. కమిషనర్లను నియమించకపోవడం, సుదీర్ఘకాలం రాష్ట్ర ప్రధాన కమిషనర్లు లేకపోవడం సర్వసాధారణంగా మారిందని ఎస్.ఎన్.ఎస్. పేర్కొంది. ఈ నివేదిక వెలువడే సమయానికి నాలుగు కమిషన్లు పూర్తిగా పనిచేయడం లేదని వెల్లడించింది. ఝార్ఘండ్, త్రిపుర, మేఘాలయ, గోవాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది.
కార్యాలయానికి వచ్చి చూసుకొని వెళ్లాలట!
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై ఉపసంహరించుకున్న కేసుల గురించి సమాచారం కోరుతూ 2017లో దరఖాస్తు చేయగా ఇవ్వకపోవడంతో.. దరఖాస్తుదారు అప్పీలుకు, కమిషన్కు వెళ్లారు. ఆ సమాచారం ఇవ్వాలంటూ 2019 నవంబరులో కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇవ్వలేదు. చాలా పేజీలు ఉంటాయని, కార్యాలయానికే వచ్చి చూసుకొని వెళ్లండని సమాచారమిచ్చారు. అధికారికంగా ఇవ్వకుండా, కేవలం చూసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని దరఖాస్తుదారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా తిరస్కరించడం, నెలల తరబడి ఏదో ఒక సాకుతో కాలయాపన చేయడం సర్వసాధారణమైందని ఆంధ్రప్రదేశ్లో సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న ఓ కార్యకర్త తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అక్కడి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం