TRS Plenary: గులాబీ ప్లీనరీ రేపే
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సోమవారం జరిగే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సర్వ ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ)కు రంగం సిద్ధమైంది. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ప్లీనరీకి
ఆరున్నరవేల మందికి ఆహ్వానాలు
ఏడు తీర్మానాలపై చర్చ
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సోమవారం జరిగే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సర్వ ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ)కు రంగం సిద్ధమైంది. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ప్లీనరీకి పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. 2018లో చివరిసారిగా హైదరాబాద్లో ప్లీనరీ జరిగింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు, కరోనా కారణంగా 2019, 20లలో జరగలేదు. కరోనా తగ్గుముఖం పట్టడంతో తెరాస మళ్లీ ప్లీనరీకి సమాయత్తమైంది. పదిరోజులుగా హెచ్ఐసీసీలో సన్నాహాలు సాగుతున్నాయి. వేదిక, ప్రాంగణం ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో ప్రతినిధులనే ఆహ్వానించారు. ప్రజాప్రతినిధుల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభం
ప్లీనరీ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని 10.45 గంటలకల్లా ప్రాంగణంలో ఆశీనులవుతారు. 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తెరాస అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్రెడ్డి ప్రకటిస్తారు. అనంతరం సీఎం ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఏడు తీర్మానాలను ప్రతిపాదిస్తారు. ఒంటి గంటకు భోజనవిరామం అనంతరం వాటిపై చర్చ నడుస్తుంది.
నోరూరించే వంటలు
ప్లీనరీలో 500 మంది నిపుణులు 29 రకాల వంటలను వండనున్నారు. ఒకేసారి 8 వేల మంది భోజనం చేసేలా మూడు హాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజా ప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలుంటాయి. దమ్చికెన్ బిర్యానీ, మటన్కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్, బోటిఫ్రై, రుమాల్రోటీ, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ఉలవచారు ఇందులో ఉంటాయి. హెచ్ఐసీసీ సమీపంలో 50 ఎకరాల్లో పార్కింగ్ ఉంటుంది.
ప్లీనరీ పాట విడుదల
ప్లీనరీ నేపథ్యంలో పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ రూపొందించిన ‘గులాబీ జెండా కేసీఆర్’ పాట ఆడియో సీడీని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం తెలంగాణభవన్లో విడుదల చేశారు. సుద్దాల అశోక్తేజ ఈ పాటను రాశారు.
గులాబీమయంగా నగరం.. ప్రపంచ రికార్డుకు ప్రయత్నం
ప్లీనరీ ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ రోడ్లన్నీ కేసీఆర్ కటౌట్లు, తెరాస సంక్షేమ పథకాలను వివరించే ఫ్లెక్సీలతో దర్శనమిస్తున్నాయి. ప్రముఖ శాండ్ఆర్టిస్ట్ కాంత్రిసా 20 మీటర్ల వెడల్పుగల కాన్వాస్పై ఇరవై ఏళ్ల తెరాస ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయనున్నారు. ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి తెరాస శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రాంగణం వద్ద కోట గుమ్మాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల థీమ్లతో ఎల్ఈడీ ధగధగలు, వేలాది ఫొటోలతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను చూపించనున్నారు. తెరాస పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. తెరాస ఏర్పాట్లతో యావత్ భాగ్యనగరం గులాబీమయంగా మారనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.