Telangana News: అడవిలో అభిమన్యులు.. దాడులు జరిగితే అంతే!
ఒకవైపు అటవీ భూముల్ని ఆక్రమణల నుంచి కాపాడాలి. మరోవైపు అటవీ సంపదను కాపాడే క్రమంలో స్మగ్లర్ల దాడుల్ని ఎదుర్కోవాలి.
బీట్ ఆఫీసర్ పోస్టుల్లో 38 శాతం ఖాళీలు
ఒక్కో ఎఫ్బీఓకు రెండు మూడు బీట్ల బాధ్యతలు
ఆక్రమణదారులు, స్మగ్లర్లు, అగ్ని ప్రమాదాల రూపంలో ముప్పు
ఈనాడు, హైదరాబాద్: ఒకవైపు అటవీ భూముల్ని ఆక్రమణల నుంచి కాపాడాలి. మరోవైపు అటవీ సంపదను కాపాడే క్రమంలో స్మగ్లర్ల దాడుల్ని ఎదుర్కోవాలి. వేటగాళ్ల నుంచి వన్యప్రాణుల్ని సంరక్షించాలి. రేయింబవళ్లు విధులు, అణుక్షణం అప్రమత్తం. అడవిలో అడుగుపెట్టాక ఎప్పుడు ఆపద ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. వాస్తవంగా అడవుల్లో క్షేత్రస్థాయిలో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొనేది బీట్ అధికారులే. ఇలాంటి కీలక విభాగంలో ఏకంగా 38 శాతం పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు దారుణ హత్య ఉదంతానికి ఇలాంటి పరిస్థితులే కారణమని ఆ శాఖ సిబ్బంది ఉదహరిస్తున్నారు.
ఒంటరి పోరాటం
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. అందులో అటవీ విస్తీర్ణం 26,903.70 చ.కి.మీ. అడవులను రక్షించేందుకు ఉన్న బీట్ అధికారుల పోస్టుల సంఖ్య కేవలం 3,647. ఇందులో 1,393 ఖాళీలు ఉన్నాయి. ఉన్న వాళ్లలో దాదాపు 15 శాతం మంది ఉన్నత ఉద్యోగాల శిక్షణ కోసం సెలవులో ఉన్నారు. ఈ విభాగంలో దాదాపు 42 శాతం మహిళా ఉద్యోగులే. దీంతో అరకొర సిబ్బందిపైనే అడవుల్ని కాపాడే భారం పడుతోంది. ఒక్కో అటవీ బీట్ విస్తీర్ణం 600-700 హెక్టార్లు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో బీట్ అధికారి రెండు, మూడు బీట్ల బాధ్యతలు చూడాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆక్రమణదారులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందని’ బీట్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అడవుల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే సమయంలో దాడులు ఎదుర్కొంటున్నామని, సెక్షన్కు ఒకటి మాత్రమే మంటలను ఆర్పే బ్లోయర్లు ఉన్నాయని, వేసవిలో అడవి అంటుకుంటే అనేక చోట్ల చీపుర్లతోనే మంటలు ఆర్పాల్సి వస్తోందని’ కన్నీటిపర్యంతమవుతున్నారు.
దాడులు జరిగితే అంతే
ఎఫ్బీఓలు, ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ఆర్వోలకు ఆయుధాల్లేవు. చేతిలో కర్రలే వారి ఆత్మరక్షణకు ఆయుధాలు. ఇది కూడా స్మగ్లర్ల ఆగడాలకు కారణమవుతోందనే విమర్శలున్నాయి. ‘ఎఫ్ఆర్వో స్థాయి అధికారులకు వాహనాలిచ్చినా అవి కాలం చెల్లినవి. సాధారణ జీపులు కావడంతో ఎవరైనా దాడి చేస్తే తప్పించుకునే పరిస్థితి ఉండదు. గతంలో ఓ అటవీ అధికారిని జీపులో ఉండగానే చంపేశారు. పోలీసులకు మాదిరి అన్ని వైపులా డోర్లు, ఇనుపజాలీ వంటి రక్షణ ఏర్పాట్లతో కూడిన వాహనాలుండాలి. అటవీ ఉద్యోగులకు గతంలోమాదిరి ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయం వచ్చేలోగా ప్రతి అటవీ రేంజ్కు నలుగురు, ఐదుగురు పోలీసులను ఇవ్వాలి’ అని ఎఫ్ఆర్వోలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య