London : లండన్లో మండుతున్న ఎండలు.. ప్రిన్స్ విలియం ఎదుటే పడిపోయిన సైనికులు!
లండన్లో (London) మండిపోతున్న ఎండల (Heat) కారణంగా ఓ సన్నాహక పరేడ్లో పాల్గొన్న ముగ్గురు బ్రిటిష్ సైనికులు (British Soldiers) స్పృహ తప్పి పడిపోయారు. ప్రిన్స్ విలియం (Prince William) స్వయంగా పర్యవేక్షిస్తున్న కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
Image : The Prince and Princess of Wales
లండన్: లండన్లో (London) ‘ట్రూపింగ్ ది కలర్ ’ కార్యక్రమంలో భాగంగా ప్రిన్స్ విలియం (Prince William) ఎదుట శనివారం చివరి సన్నాహక పరేడ్ నిర్వహించారు. ఎండ తీవ్రంగా ఉండటంతో పరేడ్లో పాల్గొన్న సైనికుల్లో (Soldiers) ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత (Heat) నమోదైంది. సైనికులు ఉన్ని ట్యూనిక్స్, బేర్స్కిన్ టోపీలు ధరించి పరేడ్లో పాల్గొన్నా తీవ్ర అలసటకు గురయ్యారు.
ఈ ఘటన తరువాత సైనికుల శ్రమను అభినందిస్తూ ప్రిన్స్ విలియం ట్వీట్ చేశారు. ‘ఈ ఉదయం అత్యంత వేడిని భరిస్తూ కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడికి ధన్యవాదాలు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు మంచి పనిలో పాల్గొన్నారు. అందుకు కృతజ్ఞతలు’ అంటూ పోస్టు పెట్టారు. పడిపోయిన ముగ్గురు సైనికుల్లో ఒకరు ట్రాంబోన్ వాయిస్తున్నాడు. అతడు స్పృహ తప్పిన విషయాన్ని గమనించిన వైద్యసిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లారు. చికిత్స అందజేసేందుకు యత్నిస్తుండగానే ఆ సైనికుడు లేచి మళ్లీ ట్రాంబోన్ వాయించాడు. కాగా, సౌత్ ఇంగ్లాండ్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇదివరకే హెచ్చరిక జారీ చేసింది.
‘ట్రూపింగ్ ది కలర్’ అనేది ఏటా నిర్వహించే పరేడ్. చక్రవర్తి అధికారిక పుట్టినరోజు సందర్భంగా జూన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం సన్నాహక పరేడ్లన్నీ పూర్తయ్యాయి. జూన్ 17న కింగ్ ఛార్లెస్ 3 ఎదుట ‘ట్రూపింగ్ ది కలర్’ అసలు పరేడ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.