Disease X: మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది: బ్రిటన్ శాస్త్రవేత్తలు
ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
లండన్: ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ (Disease X) రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్హామ్ (Dame Kate Bingham) చెప్పారని డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారి కంటే డిసీజ్ ఎక్స్ ప్రజలపై ఏడు రెట్లు అధిక ప్రభావం చూపిస్తుందని ఆమె వెల్లడించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం మరో కొత్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎంతో కాలంగా సూచిస్తూనే ఉంది.
‘‘ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. వాటన్నింటినీ మానవాళికి ముప్పుగా భావించలేం. కానీ, వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. వేలకొద్ది వైరస్లు ఉన్న 25 వైరస్ కుటుంబాలను శాస్త్రవేత్తలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చు. అయితే, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వైరస్లు ఈ జాబితాలో లేవు. కరోనా మహమ్మారి సోకిన వారిలో ఎక్కువ మంది వైరస్ బారి నుంచి బయటపడగలిగారు. కానీ, డిసీజ్ ఎక్స్ మాత్రం ప్రపంవ్యాప్తంగా ఎక్కువ మందిపై ప్రభావం చూపిస్తుంది’’ అని డేమ్ కేట్ అభిప్రాయపడ్డారు.
నాజీలపై ట్రూడో ప్రేమ.. భగ్గుమన్న కెనడా రాజకీయ వర్గాలు..!
డిసీజ్ ఎక్స్ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సుమారు 200 మంది శాస్త్రవేత్తలు విల్ట్షైర్లోని పోర్ట్ డౌన్ లేబొరెటరీలో జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపించే వైరస్లను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.