జైల్లోనే ఇమ్రాన్ను హత్యచేసేలా కుట్ర!
మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే గుట్టుగా మట్టుబెట్టేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరఫు న్యాయవాదులు సంచలనాత్మక ఆరోపణలు చేశారు.
గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి చిత్రహింసలు
పాక్ మాజీ ప్రధాని న్యాయవాదుల వెల్లడి
వేర్వేరు కేసుల్లో రెండు వారాల బెయిల్
అరెస్టుకు లాహోర్ పోలీసుల తాజా యత్నం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే గుట్టుగా మట్టుబెట్టేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరఫు న్యాయవాదులు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఖాన్ అరెస్టు అక్రమమనీ, వెంటనే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన నేపథ్యంలో ఇమ్రాన్తో గంటపాటు న్యాయవాదులు భేటీ అయ్యారు. జైల్లో నిద్ర పోనివ్వలేదని, మరుగు వసతి, మంచం లేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ తమకు తెలిపినట్లు వారు చెప్పారు. మూత్రవిసర్జనకు కూడా అనుమతించడం లేదని, చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే పదార్థాలు, ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయినట్లు న్యాయవాదులు తెలిపారు. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్లోని పోలీస్ లైన్స్కు తీసుకువెళ్లి, ఆహారమైనా ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రత్యేక ధర్మాసనం ఎదుట వాదనలు
అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్పై శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపి, రెండువారాల రక్షణాత్మక బెయిల్ మంజూరు చేసింది. ఖాన్ ఈ నెల 9 అరెస్టైన తర్వాత దాఖలైన ఏ కేసులోనూ ఆయన్ని ఈ నెల 17 వరకు అరెస్టు చేయవద్దని, కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఇదే కోర్టులో మరో ధర్మాసనం ఇంకో పిటిషన్పై ఆదేశించింది. ఒక హత్య కేసులో ఖాన్కు ఇచ్చిన బెయిల్ను ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు మూడో ధర్మాసనం ప్రకటించింది. దీంతో ఒకేరోజు వేర్వేరు కేసుల్లో ఇమ్రాన్కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. సుప్రీంకోర్టు రక్షణలో ఖాన్ను ఉంచి, తదుపరి విచారణ కోసం శుక్రవారం ఉదయం హైకోర్టులో హాజరుపరచాలని, అక్కడి ఆదేశాలకు కట్టుబడి ఉండాలని పాక్ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో భారీ భద్రత మధ్య ఆయన్ని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. ఖాన్ అనుకూల న్యాయవాది ఒకరు నినాదాలు చేయడంతో ఇద్దరు న్యాయమూర్తులు కొద్దిసేపు కోర్టురూం నుంచి బయటకు వెళ్లిపోయారు. తమ క్లయింట్పై ఉన్న అన్ని కేసులను ఒకేచోటకు చేర్చి, వాటిలోని వివరాలేమిటో తెలిపేలా ఆదేశించాలని ఖాన్ న్యాయవాదులు కోరారు.
కోర్టు వద్ద ఉద్రిక్తత
విచారణ ముగిశాక పీటీఐ అధినేత విలేకరులతో మాట్లాడారు. తనను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లాకే వారెంటు చూపించారనీ, ఇది ఆటవిక న్యాయమని అన్నారు. కోర్టువద్దకు ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. బెయిల్ మంజూరైన తర్వాత కూడా రాత్రి పొద్దుపోయేవరకు కోర్టులోనే ఇమ్రాన్ఖాన్ ఉన్నారు. తనను బలవంతంగా అక్కడ ఉంచారనీ, మళ్లీ ఏదోచేయాలనే దురుద్దేశం దాని వెనుక ఉందని వీడియో సందేశం వెలువరించారు. చివరకు పోలీసు ఉన్నతాధికారి వాహనంలో తన భద్రత సిబ్బందితో కలిసి అక్కడినుంచి వెళ్లారు.
ఇద్దరు సీనియర్ నేతల అరెస్టు
ఖాన్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు- మాజీ మంత్రి షిరీన్ మజారీ, పంజాబ్ ప్రావిన్స్ మాజీ మంత్రి యాస్మిన్ రషీద్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్రాన్పై తమ పరిధిలో దాఖలైన పలు కేసులకు సంబంధించి ఆయన్ని అరెస్టు చేసేందుకు లాహోర్ పోలీసులు డీఐజీ నేతృత్వంలో ఇస్లామాబాద్కు చేరుకున్నారు. మాజీ ప్రధానిని మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయని పీటీఐ నేతలు ఆరోపించారు. మొత్తం 121 కేసులు ఆయనపై పెండింగులో ఉన్నాయి.
న్యాయం చచ్చిపోయింది: షెహబాజ్
పాకిస్థాన్లో న్యాయం చచ్చిపోయిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఇమ్రాన్కు బెయిల్ ఇవ్వడం ద్వారా పాక్ సుప్రీంకోర్టు ద్వంద్వ ప్రమాణాలను చాటుకుందని శుక్రవారం కేబినెట్ సమావేశంలో విమర్శించారు. ‘ఇమ్రాన్, ఆయన పార్టీ నేతలు అబద్ధాలకోరులు. ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని నాశనం చేయడానికి వారు చూస్తున్నారు. నా సోదరుడు నవాజ్షరీఫ్ వంటి ‘పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్’ పార్టీ నేతల్ని ఇమ్రాన్ఖాన్ పదవీకాలంలో జైలు పాల్జేసినప్పుడు కోర్టులు మౌనం దాల్చాయి. కావాల్సినవారికి మేలు చేయాలనుకుంటే దేశంలో బందిపోట్లు అందరినీ విడుదల చేసేయండి’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఖాన్ విడుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ర్యాలీలు చేపడతామని అధికార పార్టీ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
చైనా పర్యటన చేపట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశాధినేత జిన్పింగ్ను ఆలింగనం చేసుకోవడంపై వైట్హౌస్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్