సంపన్న దేశాల్లోనే ‘ఆధునిక బానిసత్వం’ ఎక్కువ!
ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
భారత్, చైనాల్లో అత్యధిక సంఖ్యలో..
‘వాక్ ఫ్రీ’ తాజా నివేదికలో వెల్లడి
ఐరాస: ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ రూపొందించిన 172 పేజీల నివేదిక బుధవారం విడుదల అయింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో బానిసత్వం ఉన్నట్లు అంచనా వేసింది. నివేదిక రూపకల్పనకు విస్తృతస్థాయిలో ఇంటింటి సర్వేలు, బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ‘వాక్ ఫ్రీ’ వెల్లడించింది. ‘‘ఆధునిక బానిసత్వం సమాజంలోని ప్రతి అంశానికీ వ్యాపించింది’’ అని వాక్ ఫ్రీ వ్యవస్థాపక డైరెక్టర్ గ్రేస్ ఫారెస్ట్ తెలిపారు. నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలివే..
* బలవంతపు చాకిరీ లేదా బలవంతపు వివాహాలతో ‘ఆధునిక బానిసత్వం’లో జీవిస్తున్నవారిలో ఎక్కువమంది జీ-20లోని ఆరు దేశాల్లోనే ఉన్నారు. సంఖ్యాపరంగా.. అత్యధికంగా భారత్లో ఇలాంటివారు 1.1 కోట్ల మంది ఉండగా.. చైనా (58 లక్షల మంది), రష్యా (19 లక్షలు), ఇండొనేసియా (18 లక్షలు), తుర్కియే (13 లక్షలు), అమెరికా (11 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* 2021 ఆఖరునాటికి 5 కోట్ల మంది ‘ఆధునిక బానిసత్వం’లో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఐఎల్వో, ఐవోఎంలతోపాటు ‘వాక్ ఫ్రీ’ గత ఏడాది సెప్టెంబరులో రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఇందులో 2.8 కోట్ల మంది బలవంతపు చాకిరీలో, 2.2 కోట్ల మంది బలవంతపు వివాహాలతో మగ్గుతున్నారు. 2016తో పోలిస్తే ఇలాంటివారి సంఖ్య కోటి వరకు పెరిగింది.
* ‘ఆధునిక బానిసత్వం’ ఉత్తర కొరియా, ఎరిట్రియా, మారిటేనియా, సౌదీ అరేబియా, తుర్కియాల్లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి దేశంలోనూ అనేక రంగాల్లో బలవంతపు చాకిరీ కనిపిస్తోందని, బాల కార్మికులు ఎక్కువగా కోకా బీన్స్ సాగులో ఉన్నారని నివేదిక తెలిపింది.
* 2015లో ఐరాస నిర్దేశించిన లక్ష్యాల్లో.. 2030 నాటికి ఆధునిక బానిసత్వం, మానవ అక్రమరవాణా, నిర్బంధ చాకిరీ వంటివాటిని తుడిచిపెట్టడం ఒకటి. ప్రభుత్వాల చర్యల్లో స్తబ్దత, ఇలాంటివారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరింత సమయం పడుతుంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆధునిక బానిసత్వాన్ని అరికట్టేందుకు చర్యలను వేగవంతం చేయాలని నివేదిక సూచించింది. దీనికి రాజకీయ సంకల్పం కీలకమని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర