Germany: హాంబర్గ్ ఎయిర్పోర్టులో ఉత్కంఠకు తెర.. 16 గంటల తర్వాత దుండగుడి అరెస్టు
జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్పోర్ట్లోకి ఓ దుండగుడు కారులో దూసుకెళ్లి కాల్పులు జరిపాడు. దాంతో విమానాశ్రయంలో రాకపోకలు నిలిపివేసిన పోలీసులు 16 గంటల తర్వాత అతడిని అరెస్టు చేశారు.
బెర్లిన్: జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్పోర్ట్లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 16 గంటల తర్వాత ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని తెలిసింది. ఇన్ని గంటలుగా నిందితుడి వద్దనే ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారుతో ఓ 35 ఏళ్ల వ్యక్తి విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. భద్రతా సిబ్బందిని దాటుకొని ఎయిర్పోర్ట్లోకి చొరబడి తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆపై ఇంధనం నింపిన సీసాలకు నిప్పంటించి గాల్లోకి విసిరాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దుండగుడు కారును ఓ విమానం కింద పార్క్ చేశాడు. కారులో ఓ చిన్నారి కూడా ఉండటంతో ఆమెను రక్షించేందుకు పోలీసులు అతడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు.
కుటుంబ వివాదం కారణంగానే దుండగుడు ఇలా ప్రవర్తించినట్లు తెలిసింది. తన కుమార్తెను అపహరించుకుపోయాడంటూ అతడి భార్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె బాలికతో కలిసి స్టేజ్లో ఉండగా.. బక్ట్సెహుడ్ నుంచి వచ్చిన నిందితుడు చిన్నారిని బలవంతంగా లాక్కొనిపోయాడని జర్మన్ వార్తా సంస్థ ఎన్డీఆర్ పేర్కొంది. దీంతో హాంబర్గ్ ఎయిర్పోర్టులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుడి వద్ద 4 ఏళ్ల వయసున్న కుమార్తె కూడా ఉండటంతో పోలీసు అధికారులు దూకుడు ప్రదర్శించలేకపోయారు.
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే విమానాలు నిజంగా రాబోతున్నాయట!
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం, ఇతర విమానాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. టెర్మినల్ నుంచి ప్రయాణికులను పూర్తిగా ఖాళీ చేయించారు. ఈ పరిణామంతో సుమారు 3వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 60 విమానాల రాకపోకలను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.