S Jaishankar: లాడెన్కు ఆశ్రయమిచ్చిన మీరా మాట్లాడేది..? పాక్పై జైశంకర్ ఘాటు విమర్శలు
అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దీటుగా బదులిచ్చారు.
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి (United Nations) భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాది పాకిస్థాన్ (Pakistan)కు భారత్ మరోసారి గట్టిగా బదులిచ్చింది. ఒసామా బిన్ లాడెన్ (Osama bin Laden) లాంటి భీకర ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన దేశానికి.. పొరుగు దేశ పార్లమెంట్పై దాడికి పాల్పడిన వారికి ఐరాస(UN) వంటి ప్రపంచ వేదికపై ‘సుద్దులు’ చెప్పే అర్హత లేదని స్పష్టం చేసింది. ఐరాస భద్రతా మండలి చర్చా కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్(S Jaishankar) పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని పరోక్షంగా చైనా(China), పాకిస్థాన్లపై ఘాటు విమర్శలు చేశారు.
ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ- సంస్కరణల’పై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న జైశంకర్.. దాయాదికి దీటుగా బదులిచ్చారు. ‘‘సమస్యలపై ఉత్తమ పరిష్కారం కోసం శోధిస్తున్నప్పుడు ఇలాంటి ముప్పులను(పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ) సాధారణంగా తీసుకోకూడదు. ప్రపంచం మొత్తం ఆమోదించని వాటిని సమర్థించాలనే ప్రశ్నే తలెత్తకూడదు. సీమాంతర ఉగ్రవాదాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదికి ఆతిథ్యమిచ్చిన వారికి.. పొరుగుదేశ పార్లమెంట్పై దాడి చేసిన దేశానికి ఐరాసలో ఇతరులకు ప్రబోధించే అర్హత లేదు’’ అని జైశంకర్ గట్టిగా చెప్పారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయని పాక్, చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి ముప్పు, పర్యావరణ మార్పు, ఉగ్రవాదం.. ఇలాంటి కీలక సవాళ్లపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తేనే ఐరాసపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని జైశంకర్ మరోసారి అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని పాక్ ఇకనైనా అంగీకరించి.. భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలంటూ హితవు పలికారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావు లేని వాతావరణంలో మాత్రమే తాము ఇస్లామాబాద్తో సంబంధాలను కోరుకుంటున్నామని ఐరాస వేదికగా భారత్ మరోసారి స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఐరాస భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన బహుళ పాక్షిక సంస్కరణలపై చర్చించేందుకు జైశంకర్ మంగళవారం ఐరాస కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో కలిసి అక్కడి ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. -
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?