Joe Biden: ‘నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు’: తీవ్రంగా స్పందించిన బైడెన్
రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin)కు బద్ధశత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్పందించారు. ఆయన మరణం తనను ఆశ్చర్యపర్చలేదు కానీ.. ఆ వార్త విన్న తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని అన్నారు. ‘‘పుతిన్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా నావల్నీ ధైర్యంగా గళం వినిపించారు. ఆయన మృతికి పుతినే బాధ్యుడు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని వైట్హౌస్ ప్రతినిధులు తెలిపారు.
ఆర్కిటిక్ సర్కిల్కు ఉత్తరాన ఉన్న రష్యన్ పీనల్ కాలనీలో నావల్నీ మృతి చెందారు. రెండు నెలల క్రితమే జైలు అధికారులు ఆయన్ను అక్కడకు తరలించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. నావల్నీ మరణం పుతిన్కు వినాశనకరమైన పరిణామాలను కలిగిస్తుందని కొన్నేళ్ల క్రితమే అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. 2021లో జెనీవాలో జరిగిన బైడెన్-పుతిన్ భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్పై ధిక్కారస్వరానికి మారుపేరు నావల్నీ
అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా దీనిపై స్పందించారు. ‘‘ఇది తీవ్ర విషాదకర ఘటన. రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వారిని అణచివేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ఈ ఘటన తెలియజేస్తోంది. పుతిన్ అంటే ఏమిటో ప్రపంచానికి ఇది గుర్తుచేస్తుంది’’ అని అన్నారు.
పుతిన్ శిక్ష నుంచి తప్పించుకోలేరు: నావల్నీ సతీమణి
నావల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యులియా నావల్నయా అనుమానం వ్యక్తం చేశారు. అవే గనుగ నిజమైతే.. పుతిన్, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. ‘పుతిన్, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నమ్మలేం. వారు ఎప్పుడూ అవాస్తవాలే చెప్తారు. కానీ వారు చెప్పింది నిజమైతే నా దేశానికి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి.. పుతిన్, ఆయన పరివారం బాధ్యత వహించాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది’ అని ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. ప్రస్తుతం రష్యాలో ఉన్న భయంకరమైన పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని ‘మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్స్’ వేదికగా పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!