Kohinoor: పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా.. ప్రదర్శనకు ‘కోహినూర్’ వజ్రం!
చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ‘కోహినూర్’ వజ్రాన్ని ‘విజయ చిహ్నం’గా లండన్ టవర్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. మే 26 నుంచి ఈ ప్రదర్శన ప్రజలకు అందుబాటులోకి రానుంది.
లండన్: కోహినూర్(Kohinoor).. వలస పాలనకు గుర్తుగా ఇప్పటికీ బ్రిటన్ రాజకుటుంబం(Britain Royal Family) చేతిలో ఉన్న అరుదైన వజ్రం. విక్టోరియా మహారాణి ‘కోహినూర్’ గురించి రాసిన వీలునామా ప్రకారం.. చార్లెస్ భార్య, బ్రిటన్ రాణి కెమిల్లా(camilla) ప్రస్తుతం దానిని ధరించాల్సి ఉంది. కానీ, కెమిల్లా తన కిరీటంలో కోహినూర్ను పోలిన మరో వజ్రం ధరిస్తారని బకింగ్హాం ప్యాలెస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలోనే.. లండన్ టవర్(Tower of London)లో బ్రిటన్ రాజాభరణాల (Crown Jewels) ప్రదర్శనలో భాగంగా ఈ వజ్రాన్ని ‘విజయ చిహ్నం(Symbol of Conquest)’గా ప్రదర్శించనున్నారు. బ్రిటన్ రాజభవనాలను నిర్వహించే హిస్టారిక్ రాయల్ ప్యాలెసెస్(HRP) ఈ విషయాన్ని వెల్లడించింది. మే 26 నుంచి ఈ ప్రదర్శన ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా కోహినూర్తో సహా అనేక విలువైన వస్తువుల చరిత్రను ప్రజల ముందు ఉంచనున్నట్లు హెచ్ఆర్పీ తెలిపింది.
మొదటిసారి చరిత్ర అందుబాటులోకి..
ఎలిజబెత్ రాణి అనంతరం చార్లెస్-3 రాజుగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 6వ తేదీన చార్లెస్-3తోపాటు ఆయన భార్య కెమిల్లా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా లండన్ టవర్లో రాజాభరణాల సరికొత్త ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వివాదాస్పద ‘కోహినూర్’తోపాటు సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్, 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్న కలినన్ వజ్రం, ఇంపీరియల్ స్టేట్ క్రౌన్లోని బ్లాక్ ప్రిన్స్ రూబీ తదితర ఆభరణాల చరిత్రను తొలిసారి అందుబాటులోకి తేనున్నారు. ‘ఈ ఆభరణాలు బ్రిటిష్ రాచరికానికి శక్తిమంతమైన చిహ్నాలు. ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. మూలాల నుంచి పట్టాభిషేక వేడుకలో ఉపయోగం వరకు.. వాటి గొప్ప చరిత్రను సవివరంగా ఆవిష్కరిస్తాం’ అని నిర్వాహకులు తెలిపారు.
చేతులు మారుతూ.. రాజ్యాలు తిరుగుతూ..
పర్షియన్ భాషలో కోహినూర్ అంటే ‘కాంతి శిఖరం’ అని అర్థం. ఈ వజ్రం పుట్టుక గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరులో తొలిసారి ఇది దొరికిందని చెబుతారు. తదనంతం చేతులు మారుతూ చివరకు బ్రిటిష్ పాలకుల వద్దకు చేరింది. ప్రస్తుతం ఇది లండన్ టవర్ వద్దనున్న జ్యువెల్ హౌస్లో ఉంది. ఈ వజ్రం తిరిగి ఇవ్వాలని భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ తిరస్కరించింది. ‘మొఘల్ చక్రవర్తులు, ఇరాన్ షాలు, అఫ్గాన్ ఎమిర్లు, సిక్కు మహారాజులతో సహా అనేక మంది పూర్వ యజమానులతో కూడిన ఈ వజ్రం చరిత్రను వివరిస్తాం’ అని హెచ్ఆర్పీ తాజాగా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.