Maldives: మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్పై పట్టపగలే దాడి
మాల్దీవుల రాజధాని మాలెలో పట్టపగలే దేశ ప్రాసిక్యూటర్ జనరల్పై దాడి జరిగింది. అక్కడ రాజకీయ ఘర్షణలు తలెత్తిన వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది.
ఇంటర్నెట్డెస్క్: మాల్దీవుల్లో(Maldives) కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మొదలైన రాజకీయ ఘర్షణలు పతాక స్థాయికి చేరాయి. ప్రతిపక్షం నియమించిన ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ను రాజధాని మాలెలో గుర్తు తెలియని దుండగుడు పదునైన వస్తువుతో దారుణంగా పొడిచాడు. ఆయన ఉదయం పూట వ్యాయామం చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకొంది. షమీమ్ ఎడమ చేతికి గాయమైనట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ దాడి కలకలం సృష్టిస్తోంది. 2019లో ఎంపీడీ అధికారంలో ఉన్న సమయంలో నాటి అధ్యక్షుడు ఇబ్రహీం సోలి .. షమీమ్ను ప్రాసిక్యూటర్ జనరల్గా నియమించారు. ఆయన పదవీకాలం నవంబర్ వరకు ఉంది. ఇప్పటికే ఆ దేశంలో గ్యాంగులు పలు మార్లు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయి. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై అభిశంసనకు విపక్షాలు పట్టుబట్టిన సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి అవసరమైన సంతకాల సేకరణలో తలమునకలయ్యారు. త్వరలోనే ఈ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
ఇటీవల ముయిజ్జు ప్రభుత్వంలో ముగ్గురు మంత్రుల నియామకాన్ని పార్లమెంట్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడే ఉన్న అధికార పక్షమైన పీఎన్సీ-పీపీఎం సభ్యులు ఎండీపీ ఎంపీలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురు సభ్యులు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.
అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. ఆయన అండచూసుకొని ఇటీవల కొందరు మంత్రులు భారత ప్రధానిపై హద్దులు మీరి వ్యాఖ్యలు చేయడంతో అక్కడ రాజకీయ వివాదం మొదలైంది. ఆ తర్వాత సదరు మంత్రులను పదవుల నుంచి తప్పించారు. అధికార పక్ష వైఖరిని ప్రతిపక్ష ఎండీపీ తప్పు పడుతోంది. న్యూదిల్లీతో విరోధం మాలెకు ఏమాత్రం క్షేమం కాదని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడిపై అభిశంసనను తెరపైకి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
రఫాలో వైద్య కార్యకలాపాల నిర్వహణకు మూడు రోజులకు సరిపడా మాత్రమే ఇంధన నిల్వలు ఉన్నట్లు ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన వ్యక్తంచేసింది. -
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం రన్వేపై జారిపడిన ఘటన సెనెగల్లో చోటుచేసుకుంది. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
సౌదీ అరేబియా నిర్మించనున్న కలల నగరం నియోమ్ వెనుక చీకటి కోణం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన కర్నల్ ఒకరు ఆంగ్లవార్తా సంస్థకు వెల్లడించారు. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. అంతేగాక, భారత ఎన్నికల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మాస్కో దుయ్యబట్టింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
Barron Trump: వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
-
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
-
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు