Nauru: తైవాన్కు షాక్.. దౌత్య సంబంధాలు తెంచుకొన్న నౌరు..!
తైవాన్కు గట్టిషాక్ ఎదురైంది. తనకు గుర్తింపునిచ్చే దేశాల జాబితా మరింత కుదించుకుపోయింది. నౌరు తాజాగా చైనా పక్షాన చేరింది.
ఇంటర్నెట్డెస్క్: అధ్యక్ష ఎన్నికలు ముగించుకొన్న 48 గంటల్లోనే తైవాన్కు గట్టి షాక్ తగిలింది. మైక్రోనేసియాలోని ద్వీపదేశమైన నౌరు దౌత్య సంబంధాలను తెంచుకొని చైనా పక్షాన చేరింది. ఈ మేరకు ఆ చిరు దేశం ఓ ప్రకటన విడుదల చేసింది. నౌరు రిపబ్లిక్ ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకొన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. తాజాగా నౌరు నిర్ణయాన్ని చైనా విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి స్వాగతించారు. ‘వన్ చైనా సిద్ధాంతం’ ఆధారంగా ఇరు దేశాల మధ్య బంధంలో కొత్త అధ్యాయం మొదలైందని వెల్లడించారు.
నౌరులోని రాజకీయ అస్థిరతను వాడుకొని ఆర్థిక సాయం పేరిట ఆ దేశాన్ని డ్రాగన్ తనవైపు మళ్లించుకొందని తైవాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి తియాన్ చుంగ్ క్వాంగ్ ఆరోపించారు. ఇలాంటి వ్యూహాలతో తైవాన్ను తొక్కిపెట్టవచ్చని బీజింగ్ భావిస్తోందన్నారు. తమ దేశంలో ప్రజాస్వామ్య అభివృద్ధిని ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు.
తమ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వ్యతిరేకంగా చైనా చేపట్టిన ప్రతీకార చర్యగా తైవాన్ దీనిని అభివర్ణించింది. నౌరు నిర్ణయం తమ దేశాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని తైవాన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జోసఫ్ వూ అన్నారు. ఈ నిర్ణయంతో తైవాన్ను గుర్తిస్తున్న దేశాల సంఖ్య 12కు తగ్గిపోయింది. వీటిల్లో పరాగ్వే, మార్షల్ ఐలాండ్స్, గ్వాటెమాల వంటివి ఉన్నాయి. నౌరు-తైవాన్ సంబంధాలు తెగిపోవడం ఇదే తొలిసారి కాదు. 2002లో ఒక సారి ఇలానే జరిగింది. కానీ, 2005లో ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మొదలయ్యాయి.
ఇటీవల జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) అభ్యర్థి లాయ్ చింగ్ తె విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా దేశాధ్యక్షురాలిగా కొనసాగుతున్న త్సాయింగ్ వెన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. డీపీపీ అగ్రనేతలైన త్సాయింగ్ వెన్, లాయ్ చింగ్ ఇద్దరూ... తైవాన్ను విలీనం చేసుకోవాలన్న చైనా యత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. లాయ్ను చైనా ఇప్పటికే సమస్యలు సృష్టించే వ్యక్తిగా విమర్శించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ