Hawaii Wildfire: ఎటు చూసినా కాలిన శవాలే.. బూడిదైన హవాయి స్వర్గధామం
హవాయి దీవుల్లో సంభవించిన కార్చిచ్చు (WildFire) భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య 67కు పెరిగింది. వేలాది ఇళ్లు కాలిబూడిదయ్యాయి.
లహైనా: శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక నగరం ఇప్పుడు బూడిద దిబ్బగా మారింది. ఇల్లూ-వాకిలి, చెట్టూచేమ, గొడ్డూగోదా సర్వం మాడిమసైపోయాయి. ఎటూ చూసిన కాలిన మృతదేహాలు.. దగ్ధమైపోయిన భవనాలతో హృదయ విదారక దృశ్యాలే కన్పిస్తున్నాయి. అమెరికాలో హవాయి (Hawaii) దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా (Lahaina) రిసార్టు నగరంలో కార్చిచ్చు (WildFire) మిగిల్చిన పెను విషాదమిది. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటివరకు 67 మందిని బలి తీసుకుంది.
హవాయి దీవుల సమూహంలో ఒకటైన మౌయి దీవిలో గల లహైనా పట్టణంలో గత మంగళవారం రాత్రి మొదలైన ఈ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. సుదూరంలో ఏర్పడిన హరికేన్ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు తోడై క్షణాల్లోనే పట్టణమంతా విస్తరించింది. చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి. దీంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బూడిదైన కార్లు, నివాసాలు..
కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, ఇతర భవనాలు కాలిబూడిదయ్యాయి. రోడ్డు మీద నిలిపి ఉంచిన వాహనాలు నామరూపాల్లేకుండా దగ్ధమయ్యాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో పిల్లులు, పక్షులు, ఇతర జంతువులు మంటల్లో కాలిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోగా.. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కార్చిచ్చు కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి తమ భవిష్యత్తు ఏంటో తెలియక అంధకారంలో కూరుకుపోయారు.
హవాయి కార్చిచ్చులో.. భారత ‘వృక్ష విలాపం..!’
సైరన్లు మోగించకపోవడం వల్లే తీవ్ర ప్రాణ నష్టం..
కార్చిచ్చు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు నిర్లక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మంటలు నివాసాల సమీపానికి చేరేముందు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎలాంటి వార్నింగ్ సైరన్లు మోగించలేదని రికార్డుల్లో తెలిసింది. అందుకు బదులుగా మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియో స్టేషన్ల ద్వారా అలర్ట్ సందేశాలు పంపించారట. అయితే అప్పటికే కార్చిచ్చు కారణంగా చాలా చోట్ల విద్యుత్, మొబైల్ సిగ్నళ్లు లేకపోవడంతో ప్రజలకు ఈ సందేశాలు చేరలేదని తెలుస్తోంది. దీని వల్లే అధిక ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఆస్తినష్టం పరంగా హవాయి చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు ఇదని అధికారులు పేర్కొన్నారు. మౌయి దీవిలో ఉండే ఈ పట్టణానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు హవాయిన్ రాజ కుటుంబం ఇక్కడ నివసించింది. ప్రస్తుతం ఇక్కడ 12వేల మంది నివాసముంటున్నారు. పర్యాటకంగానూ ఈ నగరం ప్రత్యేకమైనది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మనదేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. -
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
Barron Trump: వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం