PM Modi: మానవతా చరిత్రలో యూఏఈ సువర్ణ అధ్యయనాన్ని లిఖించింది: ప్రధాని మోదీ
యూఏఈ రాజధాని అబుధాబీలో ప్రధాని మోదీ హిందూ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ సువర్ణ అధ్యయనాన్ని లిఖించిందన్నారు.
యూఏఈ: అబుధాబీ (Abudhabi)లో హిందూ దేవాలయ నిర్మాణంతో మానవతా చరిత్రలో యూఏఈ సువర్ణ అధ్యయనాన్ని లిఖించిందని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఇది మానవత్వానికి వారసత్వంగా నిలిచిపోతుందని అన్నారు. ఆలయ నిర్మాణం సాకారం చేసిన ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జాయెద్ అల్ నహ్యాన్కు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులే (Indians) కాకుండా ఇండియా (India) లో ఉన్న 140 కోట్ల మంది గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ (UAE)కి వెళ్లిన ప్రధాని మోదీ.. అబుధాబీలో 27 ఎకరాల్లో రూ.700 కోట్లతో నిర్మించిన బాప్ హిందూ దేవాలయాన్ని (BAPS Hindu Temple) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన ప్రతి క్షణం జాతికే అంకితం చేశానని అన్నారు. తనకు మాతృభూమితో ఎంతో లోతైన ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, ప్రతిక్షణాన్ని దేశ పురోగతికి వచ్చిన అవకాశంగా భావిస్తానని ప్రధాని వ్యాఖ్యానించారు.
‘‘బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం, షేక్ జాయెద్ మసీదు, ఇతర హైటెక్ భవనాలకు ప్రసిద్ధి పొందిన యూఏఈకి ఇప్పుడు మరొక సాంస్కృతిక గుర్తింపు వచ్చి చేరింది. భవిష్యత్తులో మరింతమంది భక్తులు ఇక్కడి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ఆలయ వైభవం మరింత మందిని యూఏఈకి వచ్చేలా చేస్తుంది. ఇది ప్రజల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేలా చేస్తుందన్న విశ్వాసం నాకుంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకారం అందించిన యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆ దేశ ప్రభుత్వానికి భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
‘‘అబుధాబీలో నిర్మించిన ఈ ఆలయం ఐక్యత, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో యూఏఈ ప్రభుత్వం అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెరుగుతాయని నమ్ముతున్నాను. సాంస్కృతికంగా, దౌత్యపరంగా ఈ దేవాలయం ఇరుదేశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆలయ నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చిన యూఏఈ అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఆయనకు భారత్ పట్ల ఉన్న ప్రేమ, గౌరవం ఈ కార్యక్రమంతో తెలుస్తోంది. ఆయన మద్దతు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు’’ అని ప్రధాని పేర్కొన్నారు. దుబాయ్లో భారత కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్ స్థలం కేటాయించారని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.