Genocide: ఇజ్రాయెల్ది మారణహోమమే..! ‘ఐసీజే’లో దక్షిణాఫ్రికా వాదన
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా వాదనలు వినిపించింది.
ది హేగ్: గాజాలో పాలస్తీనీయుల పట్ల ఇజ్రాయెల్ (Israel) మారణహోమానికి (Genocide) పాల్పడుతోందని దక్షిణాఫ్రికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ప్రాంతంపై సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ICJ) అభ్యర్థించింది. పాలస్తీనీయన్లపై పొరుగు దేశం దశాబ్దాలుగా సాగిస్తున్న అణచివేతలో ‘గాజా యుద్ధం (Gaza War)’ ఓ భాగమని దక్షిణాఫ్రికా (South Africa) తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ ఆరోపణలను నెతన్యాహు ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది.
ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై గురువారం ఐసీజేలో విచారణ మొదలైంది. ‘‘మారణహోమం జరిగిందని ముందుగానే ప్రకటించలేం. కానీ, గత 13 వారాలుగా గాజాలో జరుగుతోన్న విధ్వంసం కళ్లముందు కనిపిస్తోంది. హత్యాకాండలో తల్లులు, తండ్రులు, చిన్నారులు.. చివరకు నవజాత శిశువులనూ వదలడం లేదు. ఆహారం, నీరు, ఔషధాల లభ్యత రోజువారీ పోరాటంగా మారింది. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వక చర్యలకు ఇవన్నీ తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి’’ అని దక్షిణాఫ్రికా న్యాయవాది ఆదిలా హాసిమ్ పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు తప్ప ఈ దారుణాలను ఏదీ ఆపలేదన్నారు.
‘గాజా పౌరుల ఆకలి కేకలు.. ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహంలో భాగమే!’
ఈ కేసులో ఇజ్రాయెల్ తరఫు న్యాయవాదులు శుక్రవారం వాదనలు వినిపించనున్నారు. సాధారణంగా ఐరాసను, అంతర్జాతీయ సంస్థలను ఈ దేశం పెద్దగా పట్టించుకోదు. కానీ, తమ సైనిక చర్యను సమర్థించుకోవడానికి ఈసారి అత్యంత నిపుణులైన న్యాయవాదులను పంపింది. అంతకుముందు ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాలో చర్యలను సమర్థించుకున్నారు. తమకు మారణహోమంతో సంబంధం లేదన్నారు. ‘‘మేం హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాం. పాలస్తీనా ప్రజలతో కాదు. అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.