UK visa: యూకే వీసా కఠిన నిబంధనలు.. నేటి నుంచి అమల్లోకి!
యూకే యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులు ఇకనుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు.
లండన్: బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు వీసా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు. పోస్టుగ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులతో పాటు ప్రభుత్వ స్కాలర్షిప్ కోర్సులు చేసే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వలసల నియంత్రణలో భాగంగా తీసుకువచ్చిన ఈ కఠిన నిబంధనలు నేటి నుంచి అమలు చేస్తున్నట్లు బ్రిటన్ పేర్కొంది.
బ్రిటన్కు వస్తోన్న విదేశీ విద్యార్థులు తమ కుటుంబీకులను తీసుకురావడం ఇటీవల భారీగా పెరిగింది. 2019 నుంచి 930శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2019 సెప్టెంబర్లో 14,839 వీసాలు జారీ చేయగా.. సెప్టెంబర్ 2023 నాటికి ఈ సంఖ్య 1.52లక్షలకు పెరిగినట్లు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) వెల్లడించింది. వీటితోపాటు అక్రమ వలసలపైనా బ్రిటన్ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.
యూకేలో కొత్త వీసా రూల్స్.. భారతీయ విద్యార్థులపై ప్రభావమెంత..?
ఇలా భారీ సంఖ్యలో వస్తోన్న వలసలను తగ్గిస్తామని బ్రిటన్ పౌరులకు ఇచ్చిన మాటపై తమ ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంటోందని బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ పేర్కొన్నారు. ‘సరిహద్దులను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రక్షించుకునే చర్యలు ఈ ఏడాది మొత్తం ఉంటాయి. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు వారి కుటుంబీకులను తీసుకువచ్చే అసమంజన చర్యలకు నేటితో ముగింపు పడింది. దీని ద్వారా వేల సంఖ్యలో వలసలు తగ్గుతాయి. ఇలా దాదాపు 3లక్షల మందిని నిరోధించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాం’ అని జేమ్స్ క్లెవర్లీ వెల్లడించారు.
ఇదిలాఉంటే, బ్రిటన్లో పని చేసేందుకు స్టూడెంట్ వీసాను బ్యాక్డోర్ మార్గంగా ఎంచుకుంటున్నట్లు గతేడాది మేలో అప్పుటి బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ (Suella Braverman) పేర్కొన్నారు. ఇలా దేశంలో పెరుగుతోన్న అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు వీసా నిబంధనల్లో మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే స్టూడెంట్ వీసాపై కుటుంబీకులను అనుమతించకూడదని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!