Israeli: ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ఎదుట అమెరికా వాయుసేన ఉద్యోగి ఆత్మహత్యాయత్నం..!
గాజాపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనకు ముందు అతడు తనను తాను ఆరోన్ బుష్నెల్గా పరిచయం చేసుకొన్నాడు. ‘‘ఈ నరమేధంలో నేను ఇంక భాగస్వామిని కాబోను’’ అని ప్రకటించాడు. పాలస్తీనా వాసుల బాధతో పోలిస్తే తాను అనుభవించబోయేది తక్కువే అని పేర్కొన్నాడు. ఆ తర్వాత రికార్డ్ పరికరాన్ని నేలపై ఉంచి తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్ను శరీరంపై పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ‘ఫ్రీ పాలస్తీనా’ అనే నినాదాలు చేశాడు. అగ్నికీలల్లో కాలుతూ నేలపై పడిపోయాడు. సమాచారం అందుకొన్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తగిన పరికరాలతో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన రాజకీయ నిరసన చర్యగా అభివర్ణించారు. డిసెంబర్లో కూడా అట్లాంటాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఎదుట ఒక వ్యక్తి ఇదే విధంగా చేసినట్లు గుర్తు చేశారు. అమెరికా వాయుసేన దీనిపై స్పందిస్తూ.. ఆరోన్ తమ సిబ్బందే అని పేర్కొంది. తన నిరసనను అతడు ఓ సామాజిక మాధ్యమంలో లైవ్స్ట్రీమ్ చేశాడు. కానీ, తర్వాత ఆ దృశ్యాలను దాని నుంచి తొలగించారు.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఆ తర్వాత గాజాపై మొదలైన ప్రతిదాడిలో ఇప్పటి వరకు దాదాపు 30,000 మంది పాలస్తీనా వాసులు మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. దీనిని ఆపాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్