COP28: ‘వాతావరణ సంక్షోభం.. భారత్పై ప్రపంచం ఆశలు..!’
శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విషయంలో భారత్ ఓ ఆశాకిరణమని ‘కామన్వెల్త్’ సెక్రెటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ పేర్కొన్నారు.
దుబాయి: వాతావరణ సంక్షోభానికి (Climate Crisis) పరిష్కారం చూపడంలో భారత నాయకత్వం, మేధో శక్తిపై ప్రపంచం ఆశలు పెట్టుకుందని కామన్వెల్త్ (Commonwealth) సెక్రెటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ (Patricia Scotland) పేర్కొన్నారు. ఆవిష్కరణల విషయంలో భారత్ అద్భుతంగా రాణిస్తోందని తెలిపారు. దుబాయి వేదికగా సాగుతోన్న ‘కాప్-28 (COP28)’ వాతావరణ సదస్సు సందర్భంగా ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈమేరకు మాట్లాడారు.
శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెరుగుతోన్న వేళ.. భారత్ తన 140 కోట్లమంది ప్రజలకు ఆహారం, సంరక్షణను అందించాల్సిన అవసరం ఉందని ప్యాట్రిసియా గుర్తుచేశారు. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్గారాలను తగ్గించేందుకు అవలంబించాల్సిన ఉత్తమ మార్గాలపై ‘కాప్-28’ సదస్సులో చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే.
‘శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విషయంలో భారత్ ఓ ఆశాకిరణం. భారత్తోపాటు కామన్వెల్త్ దేశాల నుంచి వస్తోన్న మేధోశక్తి.. ఈ సమస్యను పరిష్కరించడంలో సాయం చేయగలదు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విషయంలో భారత్ తన నాయకత్వ స్థానాన్ని కొనసాగించాలి. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక వనరులకు పరివర్తన అనేది చిటికెలో జరిగే పని కాదు. దీనికోసం నిష్పక్షపాత విధానాలు, ప్రణాళికలు అవసరం’ అని ప్యాట్రిసియా వ్యాఖ్యానించారు.
‘వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్.. లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడమే కాకుండా, పశ్చిమ దేశాలతో పోలిస్తే తక్కువ వ్యయంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకుంది. ఆవిష్కరణల విషయంలో అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది. ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ యూనికార్న్లు ఉన్నాయి. భారతీయ ‘జుగాడ్’ (చుట్టూ ఉన్న వస్తువులతోనే సులువైన పరిష్కారం).. చిన్న దేశాలకు స్ఫూర్తి’ అని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.