Shamshabad: పిల్లలు తాగే హెల్త్‌ డ్రింక్‌ పౌడర్‌లో బంగారం

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఓ మహిళ పిల్లలు తాగే హెల్త్‌ డ్రింక్‌ పౌడర్ డబ్బాలో 127 గ్రాముల బంగారం పొడిని తీసుకొచ్చింది. దీని విలువ రూ.7.77 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, లోదుస్తుల్లో పేస్టు రూపంలో రూ.45.37 లక్షల విలువ చేసే 726 గ్రాముల బంగారం తీసుకొచ్చిన మరో మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 18 Jun 2023 15:56 IST

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఓ మహిళ పిల్లలు తాగే హెల్త్‌ డ్రింక్‌ పౌడర్ డబ్బాలో 127 గ్రాముల బంగారం పొడిని తీసుకొచ్చింది. దీని విలువ రూ.7.77 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, లోదుస్తుల్లో పేస్టు రూపంలో రూ.45.37 లక్షల విలువ చేసే 726 గ్రాముల బంగారం తీసుకొచ్చిన మరో మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

మరిన్ని