YSRCP: గన్నవరం నుంచి బరిలోకి దిగేది వంశీనే: కొడాలి నాని

గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై గత కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా గన్నవరంలోని వైకాపా ప్లీనరీలో మాజీమంత్రి కొడాలి నాని దీనిపై స్పష్టత ఇచ్చారు.‘‘2024లో గన్నవరం నుంచి వైకాపా అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారు. నేతల మధ్య విభేదాలు ఉంటే పిలిచి మాట్లాడతానని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. అందరూ కలిసి పనిచేయాలి’’ అని కొడాలి నాని ప్రకటించారు.

Published : 30 Jun 2022 21:09 IST

గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై గత కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా గన్నవరంలోని వైకాపా ప్లీనరీలో మాజీమంత్రి కొడాలి నాని దీనిపై స్పష్టత ఇచ్చారు.‘‘2024లో గన్నవరం నుంచి వైకాపా అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారు. నేతల మధ్య విభేదాలు ఉంటే పిలిచి మాట్లాడతానని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. అందరూ కలిసి పనిచేయాలి’’ అని కొడాలి నాని ప్రకటించారు.

Tags :

మరిన్ని