kanna: కన్నా లక్ష్మీనారాయణ మానవత్వం.. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు
మాజీ మంత్రి, తెలుగు దేశం సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshminarayana) మానవత్వం చాటుకున్నారు. ఆయన సత్తెనపల్లి నుంచి రాజుపాలెం మండల పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చౌటపాపాయపాలెం వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరగడాన్ని కన్నా లక్ష్మీ నారాయణ గమనించారు. ఘటనా స్థలంలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడిని పరామర్శించారు. అంబులెన్స్ వెంటనే పంపించాలని, వైద్యం అందించాలని వైద్యాధికారుల్ని ఫోన్లో కోరారు. చాలా సేపటివరకు అంబులెన్స్ రాకపోవడంతో.. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు సొంత వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇంతలో అంబులెన్స్ రావడంతో అందులో సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
Updated : 20 Aug 2023 20:03 IST