Malla reddy: నా కుమారుడిని సీఆర్‌పీఎఫ్‌ దళాలతో కొట్టించారు: మల్లారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భాజపాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి సంపాదించి నిజాయితీగా మెలిగానన్నారు. ‘‘ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. భాజపా అక్రమంగా దాడులు చేయిస్తోంది. దాడులకు బెదిరేది లేదు. నా కుమారుడు ఆస్పత్రిలో చేరాడు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా కొట్టించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుంది’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 23 Nov 2022 10:01 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భాజపాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి సంపాదించి నిజాయితీగా మెలిగానన్నారు. ‘‘ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. భాజపా అక్రమంగా దాడులు చేయిస్తోంది. దాడులకు బెదిరేది లేదు. నా కుమారుడు ఆస్పత్రిలో చేరాడు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా కొట్టించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుంది’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు