MS Dhoni - CSK: మైదానమంతా కలియదిరిగిన ధోనీ సేన.. హోరెత్తిన చెపాక్
ఐపీఎల్ (IPL 2023) సీజన్ లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరాయి. తాజాగా చెన్నైసూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల (CSK vs KKR) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సీజన్లో లీగ్ స్టేజ్లో సొంతమైదానం వేదికగా చెన్నై జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ ముగిశాక.. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మైదానంలోకి వచ్చి ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ను తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Updated : 15 May 2023 14:52 IST
Tags :