Tillu Square: ‘డీజే టిల్లు2’.. వచ్చేస్తోంది.. హీరోయిన్ పూజాహెగ్డే అనుకున్నాడట!
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన ‘డి.జె.టిల్లు’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘టిల్లుస్వ్కేర్’ (Tillu)2 అనే టైటిల్ ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా అనుకున్నానంటూ పోలీస్ ఎదుట సిద్ధు చేసే సందడి నవ్వులు పంచుతోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇందులో కథానాయికగా ఎంపికైంది.
Updated : 24 Oct 2022 14:35 IST
Tags :