Koppula Eshwar: భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ

పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి, భారాస (BRS) ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ తగిలింది. రామగుండంలోని జీడీకే వన్‌ ఇంక్లైయిన్‌ బొగ్గుగనిలో కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర నేతలు ప్రచారానికి వెళ్లారు. ఈశ్వర్‌ బంధువులను గని లోపలికి దించకుండా పైన విధులు అప్పగించడపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూంలో కూర్చునే నాయకులకు తమ సమస్యలెలా తెలుస్తాయంటూ మహిళలు ప్రశ్నించారు. వర్క్‌షాప్‌ నుంచి మహిళా కార్మికులను మూకుమ్మడిగా బదిలీ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. 

Updated : 10 Apr 2024 11:26 IST

పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి, భారాస (BRS) ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ తగిలింది. రామగుండంలోని జీడీకే వన్‌ ఇంక్లైయిన్‌ బొగ్గుగనిలో కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర నేతలు ప్రచారానికి వెళ్లారు. ఈశ్వర్‌ బంధువులను గని లోపలికి దించకుండా పైన విధులు అప్పగించడపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూంలో కూర్చునే నాయకులకు తమ సమస్యలెలా తెలుస్తాయంటూ మహిళలు ప్రశ్నించారు. వర్క్‌షాప్‌ నుంచి మహిళా కార్మికులను మూకుమ్మడిగా బదిలీ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. 

Tags :

మరిన్ని