బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 17:25 IST

జగన్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు: చంద్రబాబు

పాతట్నం: అహంకారంతో సీఎం జగన్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వని దుర్మార్గుడు జగన్‌ అని మండిపడ్డారు. రాష్ట్రం గెలవాలనే మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్‌ స్వీప్‌ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. రామ్మోహన్‌ నాయుడిని మూడోసారి ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్‌ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని

తాజా వార్తలు