Yaksha Prashnalu: యక్ష ప్రశ్నలు 125... అవేంటో తెలుసా?
యక్ష రూపంలో యముడు ధర్మరాజుకు 125 ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకే ధర్మరాజు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన సోదరులను దక్కించుకున్నాడు.
మానవ జీవన విధానం అర్థవంతంగా సాగేలా జీవన మర్మాలను చర్చిస్తూ మనిషి జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలని మన పురాణ ఇతిహాసాలు నీతి కథలను, గాథలను మనకందించాయి. మహాభారతంలోని యక్ష ధర్మజ ప్రశ్నోత్తరాలు యక్ష ప్రశ్నల పేరిట సుప్రసిద్ధం. పాండవులు ద్వైతవనంలో అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒక విప్రుడు వచ్చి యజ్ఞార్థం ఉంచిన అరణి (అగ్నిని వెలిగించే కట్టెలు) పుల్లలను ఒక జింక సంగ్రహించుకుపోయిందని తన గోడును ధర్మరాజుకు విన్నవించుకొంటాడు. పరోప కారైన ధర్మజుడు పుల్లలను వెతికి తెచ్చే బాధ్యతను తన సోదరులకు అప్పగిస్తాడు. చాలా సమయం గడచినా వారు తిరిగిరారు. తానే స్వయంగా బయలుదేరి వెళ్ళి అక్కడ జలాశయం వద్ద విగతజీవులైన సోదరులను గమనిస్తాడు ధర్మజుడు.
తానూ ఆ జలాన్ని తాగబోతుండగా ఆకాశవాణి రూపంలో, ‘నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ సోదరులు మరణించారు. నువ్వైనా సమాధానాలు చెప్పి నీటిని గ్రోలి నీ వారిని బతికించుకో’ అని ఆజ్ఞాపిస్తాడు. సాక్షాత్తు యముడే ఆ యక్షరూపంలో ప్రశ్నలు సంధిస్తున్నాడని తెలిసిన ధర్మరాజు తెలివిగా ఆ నూట ఇరవై అయిదు ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన సోదరులను దక్కించుకొంటాడు. యక్ష ప్రశ్నలు సత్య, ధర్మ, అర్థ, మోక్ష మార్గాలను నిర్దేశిస్తూ మానవ జీవితం సుసంపన్నం కావడానికి దోహదపడతాయి.
ధర్మం గురించి, ధర్మ దీక్ష గురించి యక్షుడు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ధర్మం వల్ల ఆత్మ ప్రకాశించి నిత్యకర్మలు సవ్యంగా సాగుతాయని, ఆత్మ సూర్యుడిలా వెలుగుతూ దుష్టత్వాన్ని దూరం చేస్తుందని చెబుతాడు. తాము చేసే దానధర్మాలు జీవులకు సర్వోన్నతమైనవని వారి కీర్తి ప్రతిష్ఠలను ఆచంద్రతారార్కం వెలిగిస్తాయని చెబుతాడు ధర్మరాజు. ఉన్నతమైన ధర్మమేదని ప్రశ్నించిన యక్షుడికి సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటమేనని ధర్మజుడి సమాధానం. తనకున్న సంపదను ఇతరుల శాంతి సౌభాగ్యాల కోసం వినియోగించడమే ఉత్తమమైన దానమని వివరిస్తాడు ధర్మనందనుడు. సత్యం ఎటువంటిది అన్న ప్రశ్నకు సర్వ దేవతలు, సూర్యచంద్రులు కూడా సత్యానికి కట్టుబడి ఉంటారని, సత్యాన్ని పలికేవారికి దైవం వెన్నంటి ఉంటాడని సమాధానం చెబుతాడు.
గాలి కంటే వేగమైనది ఏది అన్న ప్రశ్నకు మనసేనని చెబుతూ దాన్ని నిగ్రహిస్తే కోరికల సాగరాన్ని ఎదురీది బయటపడవచ్చు అంటాడు ధర్మరాజు. విచారం పొందిన మనసుకు ఉపశమనాన్ని అందించేది భగవన్నామమేనని వక్కాణిస్తాడు. ఎవరు భాగ్యవంతుడు అన్న ప్రశ్నకు గణించలేని గడ్డిపరకల్లా గజిబిజిగా జనించే కోరికలను నియంత్రించేవారే భాగ్యవంతులు అంటాడు ధర్మరాజు. సంపదలు తాండవిస్తున్నా పరోపకారగుణం కొరవడినవారు, పితృభక్తి లేనివారు జీవన్మృతులని యక్ష ప్రశ్నకు మరో సమాధానం. ఏది విసర్జించిన ప్రేమను పొందవచ్చు అని అడిగినప్పుడు గర్వాన్ని, అహంకారాన్ని వీడిన మనిషి గౌరవమర్యాదలకు పాత్రుడవుతాడని, వాటి వల్ల భోగం, సౌభాగ్యం ప్రాప్తిస్తాయని చెబుతాడు.
లోకంలో బరువైనది, ఎత్తయినది ఏదన్న ప్రశ్నకు తల్లిప్రేమ, తండ్రి మమతేనని రూఢిగా సమాధానం చెబుతాడు. సౌఖ్యమైనది సంతృప్తి అని, ఉత్తమ మిత్రులు ఆలుమగలేనని, పరుల క్షేమమే పుణ్యగతులకు హేతువని, గౌరవించదగినది ఐకమత్యమని, ఉత్తమభాగ్యం ఆరోగ్యమని, మహావిషాలంటే అరిషడ్ వర్గాలని, సత్యాన్ని పరిరక్షించేది జ్ఞానమని... ఇలా ఎన్నో ప్రశ్నలకు అలవోకగా జవాబులు చెప్పి యక్షుడి ప్రశంసలందుకుంటాడు ధర్మరాజు. తనకున్న దానితో తృప్తిని పొంది అందరికీ తలలో నాలుకలా, పదిమందీ మెచ్చేలా జీవిస్తూ కీర్తిని పొందేవాడే నిజమైన సంపన్నుడు. మహాభారత కాలం నాటి ఆ యక్షప్రశ్నలు మనకూ వర్తిస్తాయని గమనించి వాటి అర్థాలను, ధర్మాలను ఆకళింపు చేసుకొని ప్రవర్తిస్తే- మనిషి జీవితం ధన్యమవుతుంది.
మాడుగుల రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యదేవ వైభవం
సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువైన అరుదైన క్షేత్రం- అన్నవరం. త్రిమూర్తుల ఏకీకృత మూర్తిమత్వంతో అన్నవరం సత్యనారాయణస్వామి అలరారుతున్నాడు. -
పోగొట్టుకున్న చోటే...
ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు. -
రాకపోకలు
జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. -
గాన రామాయణం
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. -
దైవం ప్రసాదించిన దేహం
జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈది, కాటికి కాళ్లు జాపుకొన్నవాళ్లకు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వగపెందుకు... దాని గురించి ఆలోచించకూడదు అంటారు జీవితాన్ని కాచి వడపోసిన పెద్దలు. పసితనం నుంచి పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించినా మనసు ద్రవించిపోతుంది. -
మన ప్రయాణం జ్ఞానం వైపు...
జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. -
కామరూపులు
రామాయణంలో శూర్పణఖ రాముణ్ని మోహించింది. ఆయన పొందు కోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాలరాశిగా మారింది. వయ్యారాలు వొలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకొన్నాడు. -
పరమ పూజ్యులు ఆచార్యులు
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. -
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు.